ETV Bharat / state

పాడేరు ఘాట్ రోడ్​లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

author img

By

Published : Jan 1, 2021, 3:12 PM IST

విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్ కోమలమ్మ పనుకులో అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది. రెండు రోజుల కిందటే అమ్మవారి పాదాలు పగులకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

Idol of Goddess destroyed
అమ్మవారి విగ్రహం ధ్వంసం

రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే పాడేరు ఘాట్ రోడ్​లో అమ్మవారి విగ్రహం, పాదాలు విరగ్గొట్టారు. రెండు రోజుల కిందటే అమ్మవారి పాదాలు పగుల కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘాటి కొండ మలుపులో ఉండే ఈ అమ్మవారికి.. చుట్టుపక్కల నాలుగు పంచాయతీల్లోని ముప్పై గ్రామాల ప్రజలు మెుక్కులు తీర్చుకుంటారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే పాడేరు ఘాట్ రోడ్​లో అమ్మవారి విగ్రహం, పాదాలు విరగ్గొట్టారు. రెండు రోజుల కిందటే అమ్మవారి పాదాలు పగుల కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘాటి కొండ మలుపులో ఉండే ఈ అమ్మవారికి.. చుట్టుపక్కల నాలుగు పంచాయతీల్లోని ముప్పై గ్రామాల ప్రజలు మెుక్కులు తీర్చుకుంటారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.