ETV Bharat / state

బోధనాసుపత్రుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధంచేస్తున్న ప్రభుత్వం - బోధనాసుపత్రుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం

విశాఖలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్దికి రంగం సిద్దం కానుంది. వీటికి సంబంధించిన అభివృద్ది ప్రణాళిక తయారీ (డీపీఆర్) రూపకల్పన బాధ్యత కొన్ని సంస్ధలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరువులు ఇచ్చింది. వీటి సంబంధించి నిర్ణీత సమయంలోగా నివేదికలు తీసుకుని నాడు-నేడు కింద పనులు చేపట్టనుంది.

hospitals review meeting
hospitals review meeting
author img

By

Published : Sep 4, 2020, 7:56 PM IST

ఉత్తరాంధ్ర వాసులకే కాకుండా.. ఒడిశా, ఛత్తీస్​గడ్​ వారికి సమీపంలో ఉండే మెడికల్ హబ్ విశాఖ. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్​తో సమానంగా తీర్చి దిద్దేందుకు యత్నాలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. నవరత్నాలులో భాగంగా ప్రభుత్వ బోధనాసుపత్రులలో మౌలిక సదుపాయాలను మరింతగా పెంచే విధంగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. విశాఖలోని కేజీహెచ్ 900 కోట్ల రూపాయిలతో వివిధ ఆభివృద్ది పనులు చేయాలని తలపెడుతున్నారు. దీనికి డీపీఆర్ తయారుచేసే బాధ్యతను దిల్లీలోని అర్క్ ఎన్ డిజైన్ సంస్ధకు అప్పగించారు. 3కోట్ల 87 లక్షల రూపాయిలను దీనికోసం ప్రభుత్వం చెల్లిస్తుంది.

విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) లో 478 కోట్ల రూపాయిల అభివృద్ది పనుల డీపీఆర్ తయారు చేసే బాధ్యతను హైదరాబాద్​కి చెందిన కాంటినెంటల్ డిజైనర్​కి అప్పగించారు. ఇందు కోసం రెండు కోట్ల 82 లక్షల రూపాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, రాణిచంద్రమణిదేవి ఎముకల ఆసుపత్రి, మానసిక వైద్యాలయం, విక్టోరియా ఆసుపత్రులను 195.79 కోట్ల రూపాయిలతో అభివృద్ది పనులు చేపడతారు. దీని డీపీఆర్ తయారు చేసే బాధ్యతను
హైదరాబాద్​కి చెందిన భార్గవ్ బిల్డింగ్ టెక్నాలజీ సంస్ధకు అప్పగించారు. కోటి 59 లక్షల రూపాయిలను ఈ డీపీఆర్ రూపకల్పన కోసం చెల్లించనున్నారు.

మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులను రూ. 1500 కోట్లకుపైగా ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్న భవనాలను ఆధునీకరించడం, ఆదనపు భవనాల నిర్మాణం వంటివి అన్నీ ఇందులో ఉంటాయి.

ఉత్తరాంధ్ర వాసులకే కాకుండా.. ఒడిశా, ఛత్తీస్​గడ్​ వారికి సమీపంలో ఉండే మెడికల్ హబ్ విశాఖ. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్​తో సమానంగా తీర్చి దిద్దేందుకు యత్నాలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. నవరత్నాలులో భాగంగా ప్రభుత్వ బోధనాసుపత్రులలో మౌలిక సదుపాయాలను మరింతగా పెంచే విధంగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. విశాఖలోని కేజీహెచ్ 900 కోట్ల రూపాయిలతో వివిధ ఆభివృద్ది పనులు చేయాలని తలపెడుతున్నారు. దీనికి డీపీఆర్ తయారుచేసే బాధ్యతను దిల్లీలోని అర్క్ ఎన్ డిజైన్ సంస్ధకు అప్పగించారు. 3కోట్ల 87 లక్షల రూపాయిలను దీనికోసం ప్రభుత్వం చెల్లిస్తుంది.

విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) లో 478 కోట్ల రూపాయిల అభివృద్ది పనుల డీపీఆర్ తయారు చేసే బాధ్యతను హైదరాబాద్​కి చెందిన కాంటినెంటల్ డిజైనర్​కి అప్పగించారు. ఇందు కోసం రెండు కోట్ల 82 లక్షల రూపాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, రాణిచంద్రమణిదేవి ఎముకల ఆసుపత్రి, మానసిక వైద్యాలయం, విక్టోరియా ఆసుపత్రులను 195.79 కోట్ల రూపాయిలతో అభివృద్ది పనులు చేపడతారు. దీని డీపీఆర్ తయారు చేసే బాధ్యతను
హైదరాబాద్​కి చెందిన భార్గవ్ బిల్డింగ్ టెక్నాలజీ సంస్ధకు అప్పగించారు. కోటి 59 లక్షల రూపాయిలను ఈ డీపీఆర్ రూపకల్పన కోసం చెల్లించనున్నారు.

మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులను రూ. 1500 కోట్లకుపైగా ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్న భవనాలను ఆధునీకరించడం, ఆదనపు భవనాల నిర్మాణం వంటివి అన్నీ ఇందులో ఉంటాయి.

ఇదీ చదవండి: రష్యాలో రాజ్​నాథ్​తో చైనా రక్షణ మంత్రి భేటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.