ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: దేవరాపల్లి వంతెనపై ప్రభుత్వ విప్ ప్రత్యేక దృష్టి - దేవరాపల్లి వంతెన నిర్మాణంపై ముత్యాల నాయుడు దృష్టి

ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలకు ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు స్పందించారు. విశాఖ జిల్లా దేవరాపల్లి పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి దృష్టి సారించారు. 40 లక్షల రూపాయలకు పైగా నిధులు మంజూరుకు కృషి చేశారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

whip mutyala naidu on bridge
దేవరాపల్లి వంతెనను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు
author img

By

Published : Oct 28, 2020, 10:30 PM IST

దేవరాపల్లి - పినకోట మార్గంలోని అసంపూర్తి వంతెనను వేగంగా పూర్తి చేయాలని.. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ.. ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు ఆయన స్పందించారు.

దేవరాపల్లిలో శారదా నదిపై వంతెన నిర్మాణానికి.. 40 లక్షల రూపాయలకు పైగా నిధుల మంజూరుకు కృషి చేశారు. గతంలో ఉన్న కాజ్ వే కొట్టుకుపోగా.. వంతెనపై రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయంపై.. ఆయన ఈ మేరకు శ్రమించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.

ఇదీ చదవండి:

దేవరాపల్లి - పినకోట మార్గంలోని అసంపూర్తి వంతెనను వేగంగా పూర్తి చేయాలని.. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ.. ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు ఆయన స్పందించారు.

దేవరాపల్లిలో శారదా నదిపై వంతెన నిర్మాణానికి.. 40 లక్షల రూపాయలకు పైగా నిధుల మంజూరుకు కృషి చేశారు. గతంలో ఉన్న కాజ్ వే కొట్టుకుపోగా.. వంతెనపై రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయంపై.. ఆయన ఈ మేరకు శ్రమించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.

ఇదీ చదవండి:

వరదలో కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

విశాఖలోని వంద గ్రామాలకు రాకపోకలు బంద్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.