ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రతీకార నాయకుడిగా మారారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెదేపా వ్యతిరేకమని దాడి వీరభద్రరావు ఆరోపించారు.
'ఆయన ప్రతిపక్షనేత కాదు.. ప్రతీకారపక్ష నేత'
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నాయకుడు, మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు కేవలం 29 గ్రామాల అభివృద్ధినే కాంక్షిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తనను ఓడించిన రాష్ట్రప్రజలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.
మాజీమంత్రి దాడి వీరభద్రరావు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రతీకార నాయకుడిగా మారారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెదేపా వ్యతిరేకమని దాడి వీరభద్రరావు ఆరోపించారు.
ఇదీ చదవండి:
'రాజీనామా చేశారు... తర్వాత ఏంటీ..?'