విశాఖ నేవల్ డాక్ యార్డ్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నావికా దళానికి చెందిన కృష్ణ గేట్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పట్టాల నుంచి నాలుగు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. కొరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ వైపు నుంచి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతు పనులు చేపట్టారు.
ఇదీ చదవండి: 'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే - కానీ..'