ETV Bharat / state

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న రాష్ట్రబంద్​' - state bandh latest news

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో రహస్య ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

visakha steel plant privatisation
బంద్​కి సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ
author img

By

Published : Mar 2, 2021, 7:27 PM IST

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ అన్నారు. కేంద్రంతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. ఏమీ తెలియనట్లు పాదయాత్రలు చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్​లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్టీల్​ ప్లాంట్​ను కాపాడుకునేందుకు ఈ నెల 5వ తేదీన రాష్ట్రబంద్​కు పిలుపునిస్తున్నామని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్​కి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ అన్నారు. కేంద్రంతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. ఏమీ తెలియనట్లు పాదయాత్రలు చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్​లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్టీల్​ ప్లాంట్​ను కాపాడుకునేందుకు ఈ నెల 5వ తేదీన రాష్ట్రబంద్​కు పిలుపునిస్తున్నామని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్​కి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపివేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.