విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ విద్యా శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్చంద్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో ఒక వెయ్యి 149 పాఠశాలల్లో 298 కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు.
ఇవీ చదవండి