వినియోగించిన పంచాయతీ నిధులు రికవరీ చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా కె.కోటపాడులో చేసిన ఖర్చుకు.. సరైన లెక్కలు చూపలేదని పంచాయతీరాజ్ ఈవో అప్పారావు తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచి డోకల లక్ష్మీ నుంచి రూ.10.31 లక్షలు రికవరీ చేయడానికి ఉత్తర్వులు వచ్చాయన్నారు.
పంచాయతీ నిధుల విషయమై గతంలో అందిన ఫిర్యాదు మేరకు డీఎల్పీవో విచారణ చేపట్టారు. నివేదికలో చూపిన వాటికి ఖర్చు చేసిన ఆధారాలు చూపించలేదన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆ సొమ్ము తిరిగి రాబట్టడానికి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వైకాపా ప్రోద్భలంతో అధికారులు సరిగా విచారణ చేయలేదని మాజీ సర్పంచ్ డోకల లక్ష్మీ ఆరోపించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ పథకాల అమలుకు ఎంపీడీవో హామీ