ETV Bharat / state

బలిమెల జలాశయం నీళ్లు... మీకెంత... మాకెంత..!

author img

By

Published : Oct 19, 2019, 8:10 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్ నీటి నిర్వహణ, వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు వినియోగించిన నీటి వివరాలు, భవిష్యత్తు అవసరాలపై చర్చించారు.

ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం

బలిమెల జలాశయ నీటి వినియోగంపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల అధికారుల సమావేశమయ్యారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల రిజర్వాయర్ నిర్వహణ... నీటి వాడకంపై రెండు రాష్ట్రాల అధికారులు సమీక్షించారు. సీలేరు జెన్​కో అతిథిగృహంలో నిర్వహించిన ఈ సమావేశంలో... ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకున్నాయనే అంశంపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎంత నీరు చేరిందని లెక్కలు వేశారు.

సెప్టెంబర్‌లో ఏపీ తన అవసరాల నిమిత్తం 2.39 టీఎంసీలు వాడుకోగా... ఒడిశా 6.14 టీఎంసీలు వాడుకుంది. ఒడిశా 3.74 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుందని నిర్ధరణకు వచ్చారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో జోలపుట్, బలిమెల జలాశయాల్లో 127 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు. ఏపీ వాటాగా 64.28 టీఎంసీలు, ఒడిశా వాటాగా 62.71 టీఎంసీలు నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

2019-20 ఏడాదిలో ఒడిశా కన్నా ఏపీ జెన్​కో అధికంగా 1.54 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు తేల్చారు. ఈ సమావేశంలో ఒడిశా ఓహెచ్​పీసీ తరఫున చీఫ్ జనరల్ మేనేజర్ పాండా, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్​ఎస్​పీ రావు, మేనేజర్లు పాల్గొనగా... ఏపీ జెన్కో తరఫున పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రామకోటి వెంకటేశ్వరరావు, ఈఈలు రమేష్, మల్లేశ్వర ప్రసాద్, డీఈఈ బీ.సింహాచలం, సీ.హెచ్ సురేష్​లు పాల్గొనగా... ఒడిశా జలవనరుల శాఖ నుంచి చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కృష్ణచంద్రరావు, కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాద్​నాథ్, పాల్గొన్నారు.

ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం

ఇదీ చదవండీ... 'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు'

బలిమెల జలాశయ నీటి వినియోగంపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల అధికారుల సమావేశమయ్యారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల రిజర్వాయర్ నిర్వహణ... నీటి వాడకంపై రెండు రాష్ట్రాల అధికారులు సమీక్షించారు. సీలేరు జెన్​కో అతిథిగృహంలో నిర్వహించిన ఈ సమావేశంలో... ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకున్నాయనే అంశంపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎంత నీరు చేరిందని లెక్కలు వేశారు.

సెప్టెంబర్‌లో ఏపీ తన అవసరాల నిమిత్తం 2.39 టీఎంసీలు వాడుకోగా... ఒడిశా 6.14 టీఎంసీలు వాడుకుంది. ఒడిశా 3.74 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుందని నిర్ధరణకు వచ్చారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో జోలపుట్, బలిమెల జలాశయాల్లో 127 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు. ఏపీ వాటాగా 64.28 టీఎంసీలు, ఒడిశా వాటాగా 62.71 టీఎంసీలు నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

2019-20 ఏడాదిలో ఒడిశా కన్నా ఏపీ జెన్​కో అధికంగా 1.54 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు తేల్చారు. ఈ సమావేశంలో ఒడిశా ఓహెచ్​పీసీ తరఫున చీఫ్ జనరల్ మేనేజర్ పాండా, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్​ఎస్​పీ రావు, మేనేజర్లు పాల్గొనగా... ఏపీ జెన్కో తరఫున పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రామకోటి వెంకటేశ్వరరావు, ఈఈలు రమేష్, మల్లేశ్వర ప్రసాద్, డీఈఈ బీ.సింహాచలం, సీ.హెచ్ సురేష్​లు పాల్గొనగా... ఒడిశా జలవనరుల శాఖ నుంచి చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కృష్ణచంద్రరావు, కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాద్​నాథ్, పాల్గొన్నారు.

ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం

ఇదీ చదవండీ... 'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు'

Intro:AP_VSP_56_19_ANDHRAODISSA MEETING_AV_AP10154Body:బలిమెల జలాశయం పై ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష సమావేశం ముగిసింది ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నిర్వహణ నీటి వాడకంపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమీక్ష నిర్వహించారు జలాశయంలో వినియోగంపై సీలేరు జెన్కో అతిథిగృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు బలమైన జలాశయంలో ఎంత నీరు చేరింది అనే అంశాలపైచర్చించారు సెప్టెంబర్ నెలలో ఏపీ తన అవసరాల నిమిత్తం2 39 టీఎంసీలు నీటిని వాడు కో గా ఒడిస్సా 6.14 టీఎంసీల నీటిని వాడుకుంది సెప్టెంబర్ నెలలో ఒడిస్సా 3.74 టీఎంసీల నీటిని అది అధికంగా వాడుకుంది ప్రస్తుతం కురిసిన వర్షాలతో జోలపుట్,బలిమెలా జలాశయాల్లో 127 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు దీనిలో ఏపీ వాటాగా 64.28 టీఎంసీలు ఒడిస్సా వాటాగా 62.71 టీఎంసీలు నీటిని వాడుకోవడానికి నిర్ణయించుకున్నారు 2019- 20 ఇది సంవత్సరములో ఒడిశా కన్నా ఏపీ జెన్కో అధికంగా 1.54 టీఎంసీల నీటిని అధికంగా వాడుకున్నట్లు లెక్కలు కట్టారు ఈ సమావేశంలో ఒడిస్సా ఓ హెచ్ పీసీ తరఫునుంచి చీఫ్ జనరల్ మేనేజర్ పాండా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ ఎస్ పి రావు మేనేజర్లు బికే చేతి ఎంసీహెచ్ బారిక్ పాల్గొనగా ఏపీ జెన్కో తరఫునుంచి పర్యవేక్షక ఇంజినీర్ సిహెచ్ రామకోటి వెంకటేశ్వరరావు ఈ ఈ లు రమేష్ , మల్లేశ్వర ప్రసాద్ డి ఈ ఈ బి సింహాచలం సి.హెచ్ సురేష్ లు పాల్గొనగా ఒడిస్సా జల వనరుల నుంచి చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కృష్ణ చంద్ర రావు కార్యనిర్వాహక ఇంజనీర్ కబీ ప్రసాద్ నాథ్ ఏ ఈఈ ఉమాశంకర్ సాహూ తదితరులు పాల్గొన్నారుConclusion:M Ramanarao
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.