ETV Bharat / state

విషాదం.. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు

కొన్ని సంఘటనల గురించి చెప్పడానికి మాటలు రావు. రాయడానికి అక్షరాలు సరిపోవు. ఏ తండ్రి అయినా తన కూతురుకు చిన్నదెబ్బ తగిలితేనే తట్టుకోడు. అలాంటిది విశాఖ జిల్లా మన్యంలోని గిరి గ్రామంలో ఓ తండ్రి తన కూతురు మృతదేహాన్ని 3 కిలోమీటర్లు చేతులపై మోసుకెళ్లాడు. కూతురు చనిపోయిందని బాధపడాలో.. ఇంత దీనస్థితిలో బతుకుతున్నామని సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. నిజంగా ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. పాలకులు మారినా... తమ పరిస్థితి మారదు అని అమాయక గిరిజనులు అంటుంటారు. ఈ సంఘటన చూస్తే... అది నిజమే అని మీరూ అంటారు.

author img

By

Published : Aug 15, 2020, 6:10 PM IST

A father carries his daughter's dead body 3 km on his arms
విషాదం.. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు
విషాదం.. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు

విశాఖ జిల్లా మన్యంలోని గిరి గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఏడేళ్ల కుమార్తెను ఓ తండ్రి 3 కిలోమీటర్ల దూరం చేతులతో మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మన్యంలోని డుంబ్రిగూడ మండలంలో వయ్యి గ్రామానికి చెందిన ఏడేళ్ల ఎలీచా... అనారోగ్యంతో అరకులోయ వైద్య కేంద్రంలో మృతిచెందింది. అంబులెన్స్​లో కించుమండ సంత సమీపంలోని వంతెన వరకు తీసుకువచ్చారు.

హుద్​హుద్ తుపాను సమయంలో ఆ వంతెన నేలకూలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె మృతదేహాన్ని తండ్రి బాబూరావు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి రెండు చేతులతో పట్టుకుని తీసుకెళ్లాడు. కన్నబిడ్డ ప్రాణం పోయిందన్న బాధ వెంటాడుతున్నా... తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లటం అందరినీ కంటతడి పెట్టించింది. ఏ తండ్రికీ ఇటువంటి పరిస్థితి రావొద్దని స్థానికులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన

విషాదం.. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు

విశాఖ జిల్లా మన్యంలోని గిరి గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఏడేళ్ల కుమార్తెను ఓ తండ్రి 3 కిలోమీటర్ల దూరం చేతులతో మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మన్యంలోని డుంబ్రిగూడ మండలంలో వయ్యి గ్రామానికి చెందిన ఏడేళ్ల ఎలీచా... అనారోగ్యంతో అరకులోయ వైద్య కేంద్రంలో మృతిచెందింది. అంబులెన్స్​లో కించుమండ సంత సమీపంలోని వంతెన వరకు తీసుకువచ్చారు.

హుద్​హుద్ తుపాను సమయంలో ఆ వంతెన నేలకూలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె మృతదేహాన్ని తండ్రి బాబూరావు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి రెండు చేతులతో పట్టుకుని తీసుకెళ్లాడు. కన్నబిడ్డ ప్రాణం పోయిందన్న బాధ వెంటాడుతున్నా... తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లటం అందరినీ కంటతడి పెట్టించింది. ఏ తండ్రికీ ఇటువంటి పరిస్థితి రావొద్దని స్థానికులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.