విశాఖ జిల్లా కోటవురట్ల మండలం అంజల్లూరు గ్రామానికి చెందిన రమణమూర్తి అనే ఓ దివ్యాంగుడు తన పింఛన్ సొమ్మును కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విరాళంగా అందజేశారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు. రమణమూర్తికి ప్రతినెలా మంజూరవుతున్న 2000 రూపాయలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి.. వేయి రూపాయలను ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. రమణమూర్తి ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్డీఓ సూచించారు.
ఇదీ చదవండి.