విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 25,108 మందిపై కేసులు నమోదు చేశారు. ఈనెల 5 నుంచి ఇప్పటివరకు మాస్క్లు లేని 1311 మందిని గుర్తించి, వారికి రూ.1,29,300 జరిమానా విధించారు. ఇక కర్ఫ్యూ అమల్లో ఉన్నా నిబంధనలు అమలు పరచని 25,108 మందిపై సెక్షన్ 179(1) ప్రకారం కేసు నమోదు చేసి రూ.1కోటి 25లక్షల 54వేలు జరిమానా విధించారు.
బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్న 67 మందిపై కేసులు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉంచిన 2600 వాహనాలకు చలానా విధించారు. మాస్క్లు లేకుండా బయట తిరుగుతున్న 50 మందిని గుర్తించి జరిమానా విధించారు.
ఇదీ చదవండీ… Corona: ఉమ్మడి కుటుంబంలో విషాదం..నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి