శ్రీకాకుళం జిల్లాలోని ఆధార్ కేంద్రాల వద్ద నిత్యం వేలాది మంది సవరణల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నర్సన్నపేట మండలంలోని ఆంధ్రబ్యాంకు ఆవరణలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రం వద్ద బుధవారం వందల సంఖ్యలో జనం చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల నుంచి వృద్ధుల పడిగాపులు కాశారు. ఆధార్లో సవరణల కోసం వచ్చేవారి సంఖ్య అధికంగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: అదనంగా కొనుగోలు చేయవద్దు: కలెక్టర్