ETV Bharat / state

చెల్లింపులే జరగనప్పుడు అవినీతి ఎక్కడిది: నారా లోకేశ్

author img

By

Published : Jun 26, 2020, 3:55 PM IST

Updated : Jun 26, 2020, 4:08 PM IST

151 మంది వైకాపా శాసనసభ్యులను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే తప్పుడు కేసులు బనాయించారని తెదేపా నేత నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Nara Lokesh
Nara Lokesh
మీడియాతో నారా లోకేశ్

దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యం అమలవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వైకాపా పాలనలో దక్షిణాది బిహార్​లా రాష్ట్రం మారిందని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అచ్చెన్నాయుడు భార్య విజయ మాధవి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చిన లోకేశ్‌... పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

'వెయ్యి మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఎల్‌జీ పాలిమర్స్‌పై మాట్లాడిన వృద్ధురాలిపైనా కేసులు బనాయించారు. మద్యం, ఇసుక, 108లో అవినీతికి పాల్పడుతున్నారు. తెదేపా నాయకులపైనా అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారు. ఈఎస్‌ఐ విషయంలో అచ్చెన్నాయుడుకు సంబంధం లేకున్నా ఇరికించారు. 151 మంది వైకాపా శాసనసభ్యులను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే తప్పుడు కేసులు బనాయించారు. ఈఎస్‌ఐ వ్యవహారంలో అసలు చెల్లింపులే జరగలేదు. అలాంటప్పుడు అవినీతి ఎక్కడిది' -నారా లోకేశ్

అచ్చెన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం లోకేశ్.... శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని కూన రవికుమార్ ఇంటికి వెళ్లారు. రవికుమార్ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి

అచ్చెన్నపై కొనసాగుతున్న రెండోరోజు అనిశా విచారణ

మీడియాతో నారా లోకేశ్

దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యం అమలవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వైకాపా పాలనలో దక్షిణాది బిహార్​లా రాష్ట్రం మారిందని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అచ్చెన్నాయుడు భార్య విజయ మాధవి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చిన లోకేశ్‌... పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

'వెయ్యి మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఎల్‌జీ పాలిమర్స్‌పై మాట్లాడిన వృద్ధురాలిపైనా కేసులు బనాయించారు. మద్యం, ఇసుక, 108లో అవినీతికి పాల్పడుతున్నారు. తెదేపా నాయకులపైనా అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారు. ఈఎస్‌ఐ విషయంలో అచ్చెన్నాయుడుకు సంబంధం లేకున్నా ఇరికించారు. 151 మంది వైకాపా శాసనసభ్యులను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే తప్పుడు కేసులు బనాయించారు. ఈఎస్‌ఐ వ్యవహారంలో అసలు చెల్లింపులే జరగలేదు. అలాంటప్పుడు అవినీతి ఎక్కడిది' -నారా లోకేశ్

అచ్చెన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం లోకేశ్.... శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని కూన రవికుమార్ ఇంటికి వెళ్లారు. రవికుమార్ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి

అచ్చెన్నపై కొనసాగుతున్న రెండోరోజు అనిశా విచారణ

Last Updated : Jun 26, 2020, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.