ETV Bharat / state

'రైతు బజార్​ను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలి'

author img

By

Published : Apr 16, 2020, 12:55 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో లాక్​డౌన్ కారణంగా కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలువ నీడలేని మైదానానికి రైతుబజారును తరలించటంతో అమ్మకాలు లేవని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూరగాయల వ్యాపారులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూరగాయల వ్యాపారులు

లాక్​డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెుదట ప్రభుత్వపాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును రద్దీ దృష్ట్యా...రాజావారి మైదానానికి మార్చారు. దీంతో అక్కడినుంచి కూరగాయలు తరలించడానికి అదనంగా ఖర్చు కావటంతో పాటు రాజావారి మైదానంలో నిలువ నీడలేదని వ్యాపారులు వాపోతున్నారు. దానికి తోడు అమ్కకాలు కూడా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తిరిగి ప్రభుత్వ పాఠశాలలోకి రైతుబజారును తరలించాలని వేడుకొంటున్నారు.

ఇదీచదవండి

లాక్​డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెుదట ప్రభుత్వపాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును రద్దీ దృష్ట్యా...రాజావారి మైదానానికి మార్చారు. దీంతో అక్కడినుంచి కూరగాయలు తరలించడానికి అదనంగా ఖర్చు కావటంతో పాటు రాజావారి మైదానంలో నిలువ నీడలేదని వ్యాపారులు వాపోతున్నారు. దానికి తోడు అమ్కకాలు కూడా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తిరిగి ప్రభుత్వ పాఠశాలలోకి రైతుబజారును తరలించాలని వేడుకొంటున్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.