ఇళ్ల స్థలాల కోసం భూములు లాక్కోవద్దంటూ శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. భూములు చదును చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఆ భూములు సాగు చేస్తున్నామని.. ప్రభుత్వం వాటిని లాక్కోవడం సరికాదని వారు వాపోయారు. ఈ క్రమంలో అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న రాజాం సీఐ సోమశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదీ చూడండి: