ETV Bharat / state

సిక్కోలులో భారీ వర్షాలు... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

author img

By

Published : Oct 24, 2019, 4:21 PM IST

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా  కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వీధుల్లోకి నీరు చేరి... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం.. ఉప్పొంగిన గెడ్డలు.. స్తంభించిన రాకపోకలు
భారీ వర్షం.. ఉప్పొంగిన గెడ్డలు.. స్తంభించిన రాకపోకలు

శ్రీకాకుళం జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిరమండలంలో మార్కెట్ వీధిలో గత రెండు రోజులుగా మురుగునీరు వస్తున్నా..అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. లక్ష్మీపురం, పెద్ద రొంపివలస, నేతేరు, రాయిలింగారిపేట, నేదురుపేట గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఆదపాక వద్ద పెద్దగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున 15 గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల

భారీ వర్షం.. ఉప్పొంగిన గెడ్డలు.. స్తంభించిన రాకపోకలు

శ్రీకాకుళం జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిరమండలంలో మార్కెట్ వీధిలో గత రెండు రోజులుగా మురుగునీరు వస్తున్నా..అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. లక్ష్మీపురం, పెద్ద రొంపివలస, నేతేరు, రాయిలింగారిపేట, నేదురుపేట గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఆదపాక వద్ద పెద్దగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున 15 గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల

Intro:AP_SKLM_21_24_Bharivarshaalu_Uppogina_Geddalu_SthabincinaRakapokalaku_av_AP10139 భారీ వర్షం.. ఉప్పొంగిన గెడ్డలు.. స్తంభించిన రాకపోకలు * నీటమునిగిన వందలాది ఎకరాలు పంటలు * ఆందోళనలో అన్నదాతలు శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రజలు రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఉప్పొంగిన వరద నీరు తప్ప ఇంకేం కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు రణస్థలం ఎచ్చెర్ల జి.సిగడాం మండలాల్లో వరదలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. లావేరు మండలం లో ఉన్న బుడుమూరు పెద్ద గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. బెజ్జిపురం గ్రామ సమీపంలో ఉన్న దేవునివానిచెరువు నుంచి వరద నీరు ఉధృతంగా గ్రామంలో నుంచి ప్రవహిస్తుంది. అదపాక గ్రామం సమీపంలోని ఉన్న గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు పాతరౌతుపేట సమీపంలో ఉన్న చిట్టగెడ్డ ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో రహదారి కోతకు గురికావడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దీంతోపాటు పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. ప్రస్తుతం పంటలు వర్షాలకు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


Body:భారీ వర్షం


Conclusion:భారీ వర్షం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.