శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణ పరిధిలోని గోపినాథపురం నాసిరకం కందిపప్పు పంపిణీపై... ఈనాడు- ఈటీవీభారత్ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కందిపప్పు... పుచ్చిపోయి, పురుగులు పట్టి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో టెక్కలి తహసీల్దార్ శ్రీరాములు స్పందించారు. నాసిరకం కందిపప్పును రేషన్ డీలర్, గ్రామ వాలంటీర్.. ఇంటింటికీ వెళ్లి సేకరించారు. వాటి స్థానంలో నాణ్యమైన కందిపప్పు ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఇవీచదవండి: 'విద్యార్థులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు'