ETV Bharat / state

వైకాపా నాయకుడిపై పోలీసులకు మహిళా వీఆర్వో ఫిర్యాదు - kondagudem village news

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెంకు చెందిన వైకాపా నాయకుడిపై అదే గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ కార్యాలయంలోనే తనపై దాడికి యత్నించాడని ఆరోపించింది.

A female VRO has lodged a complaint with the police against ycp leader
A female VRO has lodged a complaint with the police against ycp leader
author img

By

Published : Oct 2, 2020, 11:14 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం మాజీ సర్పంచ్, వైకాపా నాయకులు కె.సూర్యారావు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ గ్రామ వీఆర్వో కుప్పిలి సుశీల సంతకవిటి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గురువారం సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో తనపై అతను దాడి చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఆరోపించారు.

గతంలోనూ తనను కులం పేరుతో దూషించారని ఆమె చెప్పారు. దీనిపై సంతకవిటి పోలీస్​స్టేషన్​లో రాజాం రూరల్ సీఐ నవీన్​కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం మాజీ సర్పంచ్, వైకాపా నాయకులు కె.సూర్యారావు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ గ్రామ వీఆర్వో కుప్పిలి సుశీల సంతకవిటి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గురువారం సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో తనపై అతను దాడి చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఆరోపించారు.

గతంలోనూ తనను కులం పేరుతో దూషించారని ఆమె చెప్పారు. దీనిపై సంతకవిటి పోలీస్​స్టేషన్​లో రాజాం రూరల్ సీఐ నవీన్​కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.