ETV Bharat / state

నాలుగు ఇళ్లల్లో చోరీ.. 48 తులాల బంగారం మాయం

author img

By

Published : Feb 24, 2021, 7:53 PM IST

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. ఈ చోరీలో దాదాపు 48 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇద్దరు యువకులు గోడ దూకి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా.. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Thefts in four houses in kandukuru prakasam
నాలుగు ఇళ్లల్లో చోరీలు

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లల్లో యజమానులు వేరే ఊరు వెళ్లడంతో తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఇళ్లల్లో 60 సవర్ల బంగారం, 50 వేల రూపాయలు నగదు చోరీకి గురయ్యాయని బాధితలు తెలిపారు. ఈ దొంగతనాలకు ఇద్దరు యువకులు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇద్దరు యువకులు గోడ దూకి వెళుతున్న దృశ్యాలను దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లల్లో యజమానులు వేరే ఊరు వెళ్లడంతో తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఇళ్లల్లో 60 సవర్ల బంగారం, 50 వేల రూపాయలు నగదు చోరీకి గురయ్యాయని బాధితలు తెలిపారు. ఈ దొంగతనాలకు ఇద్దరు యువకులు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇద్దరు యువకులు గోడ దూకి వెళుతున్న దృశ్యాలను దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

బాలికను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.