ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ట్రస్టు బోర్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రస్టుబోర్డు ఛైర్మన్గా అద్దంకి పట్టణానికి చెందిన కోట శ్రీనివాస్ కుమార్ వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, హాజరయ్యారు. సహాయ కమిషనర్ ఎన్.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: అలీవ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన అధికారులు