ETV Bharat / state

రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం... ఒకరు మృతి

author img

By

Published : Feb 23, 2021, 9:51 PM IST

ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. కనిగిరి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.

Road accident in Prakasam district Kanigiri
రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం... ఒకరు మృతి...

మరదలి పెళ్లి పనుల నిమిత్తం సామన్ల కొనుగోలుకు.. ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన మల్లెల బివలమ్మ.. తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరి వెళ్లారు. తిరుగొచ్చే క్రమంలో వెన్నెల అపార్ట్మెంట్ వద్ద వీరి బైక్​ను ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బివలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరదలి పెళ్లి పనుల నిమిత్తం సామన్ల కొనుగోలుకు.. ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన మల్లెల బివలమ్మ.. తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరి వెళ్లారు. తిరుగొచ్చే క్రమంలో వెన్నెల అపార్ట్మెంట్ వద్ద వీరి బైక్​ను ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బివలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.