ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జోరు వర్షం కురిసింది. కొరిసపాడు, పంగులూరు మండలాల్లో మిర్చి సాగు చేసిన రైతాంగాన్ని నష్టాలపాలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో కూలీ రేట్లు అధికంగా వెచ్చించి మిర్చి కోతలు జరిగాయని, అమ్ముకునేందుకు సరైన ధర కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందారు. దీనికి తోడు వర్షం కురవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: