ఒంగోలు కోర్టు.. ఇవాళ హైవే కిల్లర్ మున్నా కేసులో తుది తీర్పు వెలువరించింది. 12 మందికి ఉరి శిక్ష వేసింది. అయితే ఈ తీర్పు సమయంలో కోర్టు పరిసరాల్లో ఇద్దరి సంచారం అనుమానాలకు తావిస్తోంది. వీరిలో ఒకరు వరంగల్ చెందిన బ్రహ్మచారి, రెండో వ్యక్తి బీహార్కు చెందిన పవన్గా గుర్తించారు.
బ్రహ్మచారి కిరాయి హంతుకుడిగా రికార్డ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మున్నా కేసు తుది తీర్పు సమయంలోనే ఇక్కడకు ఎందుకు వచ్చారో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: హైవే కిల్లర్ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'