ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మార్కాపురం సమీపంలోని పారిశ్రామికవాడ వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా...అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని గమనించారు. వెంటనే కారు దిగి గాయాలపాలైన యువకుడి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేసి వైద్యశాలకు తరలించే వరకు అక్కడే ఉన్నారు.
ఇదీచదవండి