ETV Bharat / state

కరోనాతో పోరాడి గెలిచాడు..అనంతరం అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు - చిన్న కంభంలో జవాను మృతి వార్తలు

కరోనా నుంచి కోలుకుని అనంతరం అనారోగ్యంతో జవాను మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చిన్న కంభంలో జరిగింది. శ్రీనగర్​లో మరణించిన శ్రీపతి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సైనికుడి మరణం ఆ గ్రామంలో విషాదం నింపింది.

sripathi jawan
మృతిచెందిన జవాను శ్రీపతి
author img

By

Published : Nov 23, 2020, 3:15 PM IST

కరోనా సోకి కోలుకున్నా.. తర్వాత తలెత్తిన అనారోగ్యంతో జవాను మృతి చెందడం ప్రకాశం జిల్లా చిన్న కంభంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన శెట్లం శ్రీపతి సైన్యంలో జేసీవో ర్యాంకు హోదాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్​లో విధులు నిర్వహిస్తున్నారు.

శ్రీపతి నెలరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. నెగెటివ్ వచ్చిన తర్వాత న్యూమోనియా సోకింది. శ్రీనగర్​లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 21న మృతి చెందారు. జవాన్ మృతదేహాన్ని హైదరాబాద్​ వరకు విమానంలో తీసుకువచ్చి.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాతికేళ్లుగా దేశసేవ చేసిన జవాను ఇలా అనారోగ్యంతో మరణించడం కుటుంబసభ్యులతో పాటు గ్రామంలోనూ విషాదం నింపింది.

కరోనా సోకి కోలుకున్నా.. తర్వాత తలెత్తిన అనారోగ్యంతో జవాను మృతి చెందడం ప్రకాశం జిల్లా చిన్న కంభంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన శెట్లం శ్రీపతి సైన్యంలో జేసీవో ర్యాంకు హోదాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్​లో విధులు నిర్వహిస్తున్నారు.

శ్రీపతి నెలరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. నెగెటివ్ వచ్చిన తర్వాత న్యూమోనియా సోకింది. శ్రీనగర్​లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 21న మృతి చెందారు. జవాన్ మృతదేహాన్ని హైదరాబాద్​ వరకు విమానంలో తీసుకువచ్చి.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాతికేళ్లుగా దేశసేవ చేసిన జవాను ఇలా అనారోగ్యంతో మరణించడం కుటుంబసభ్యులతో పాటు గ్రామంలోనూ విషాదం నింపింది.

ఇవీ చదవండి..

శవాగారంలో అనాథ మృతదేహాలు.. ఆరా తీస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.