ETV Bharat / state

కరోనా ప్రభావంతో ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలకు బ్రేకులు - కరోనా ప్రభావంతో ఉద్యోగమేళాలలకు బ్రేకులు

పరీక్షలన్నీ పూర్తై ... ధ్రువపత్రాలు చేతికొచ్చి... పై చదువులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు జరిపే సీజన్‌ ఇది. ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ అభ్యర్థుల హడావుడితో కళకళలాడుతుండేవి. కరోనా దెబ్బకు మొత్తం తారుమారైంది. పరీక్షల్లేవ్, ఫలితాల్లేవ్‌, ధ్రువపత్రాలూ లేవు. విద్యార్థుల తాకిడి లేక ప్రకాశం జిల్లాలో ఉపాధి కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

employment registration offices are not opened due to corona affect prakasam district
కరోనా ప్రభావంతో ఖాళీగా కనిపిస్తున్న ఉపాధి కార్యాలయాలు
author img

By

Published : Jul 22, 2020, 8:30 AM IST

కరోనా ప్రభావంతో ఖాళీగా కనిపిస్తున్న ఉపాధి కార్యాలయాలు

జూన్‌, జూలై నెలలు విద్యార్థులకు అత్యంత కీలకమైనవి. పరీక్షలు పూర్తిచేసి పై చదువులకు వెళ్లేవారు కొందరైతే... ఉద్యోగాల కోసం ప్రయత్నాలు జరిపేవారు మరికొందరు. ఇందులో భాగంగానే అభ్యర్థులు... ఎంప్లాయిమెంట్ కార్యాలయాల చుట్టూ బారులు తీరి కనిపించేవారు. ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ కోసం వచ్చే అభ్యర్థులతో కార్యాలయాలు సందడిగా ఉండేవి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఏప్రిల్‌, మే నుంచి నాలుగైదు నెలల పాటు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ ఏడాది కరోనా దెబ్బకు ఉపాధి కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు.

కరోనా భయానికి సిబ్బంది కార్యాలయాలకు సరిగా హాజరుకాలేకపోతుంటే... అభ్యర్థులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. పరీక్షలు, ఫలితాలు వాయిదా పడుతూ వస్తుండటంతో పేర్లు నమోదు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల కూడా కొందరు కార్యాలయాలకు రాలేకపోతున్నారు. దీనికి తోడూ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు పెద్దగా రాకపోతుండటం వల్ల కూడా అభ్యర్థులు కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఏటా ఈ సమయానికి ఉపాధి కల్పన అధికారులు... ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌ వల్ల ఇలాంటి కార్యక్రమాలేవీ జరగడం లేదు. ప్రకాశం జిల్లాలో సుమారు 56 వేల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారుల నుంచి పిలుపు వస్తుందన్న వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. నోటిఫికేషన్ల విడుదలతోనే ఉపాధి కార్యాలయాల్లో సందడి తిరిగి మొదలవుతుందని అభ్యర్థులు అంటున్నారు.

ఇదీ చదవండి:

జాస్మిన్..పట్టుదలకు ప్రతిరూపం

కరోనా ప్రభావంతో ఖాళీగా కనిపిస్తున్న ఉపాధి కార్యాలయాలు

జూన్‌, జూలై నెలలు విద్యార్థులకు అత్యంత కీలకమైనవి. పరీక్షలు పూర్తిచేసి పై చదువులకు వెళ్లేవారు కొందరైతే... ఉద్యోగాల కోసం ప్రయత్నాలు జరిపేవారు మరికొందరు. ఇందులో భాగంగానే అభ్యర్థులు... ఎంప్లాయిమెంట్ కార్యాలయాల చుట్టూ బారులు తీరి కనిపించేవారు. ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ కోసం వచ్చే అభ్యర్థులతో కార్యాలయాలు సందడిగా ఉండేవి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఏప్రిల్‌, మే నుంచి నాలుగైదు నెలల పాటు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ ఏడాది కరోనా దెబ్బకు ఉపాధి కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు.

కరోనా భయానికి సిబ్బంది కార్యాలయాలకు సరిగా హాజరుకాలేకపోతుంటే... అభ్యర్థులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. పరీక్షలు, ఫలితాలు వాయిదా పడుతూ వస్తుండటంతో పేర్లు నమోదు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల కూడా కొందరు కార్యాలయాలకు రాలేకపోతున్నారు. దీనికి తోడూ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు పెద్దగా రాకపోతుండటం వల్ల కూడా అభ్యర్థులు కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఏటా ఈ సమయానికి ఉపాధి కల్పన అధికారులు... ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌ వల్ల ఇలాంటి కార్యక్రమాలేవీ జరగడం లేదు. ప్రకాశం జిల్లాలో సుమారు 56 వేల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారుల నుంచి పిలుపు వస్తుందన్న వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. నోటిఫికేషన్ల విడుదలతోనే ఉపాధి కార్యాలయాల్లో సందడి తిరిగి మొదలవుతుందని అభ్యర్థులు అంటున్నారు.

ఇదీ చదవండి:

జాస్మిన్..పట్టుదలకు ప్రతిరూపం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.