ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రజలకు కరోనా నిర్ధరణ పరీక్షల కోసం.. స్వాబ్లను తీస్తున్నారు. ఈ స్వాబ్లను పరీక్షించి ఫలితాలు వెల్లడించడంలో పది నుంచి పదిహేను రోజులు ఆలస్యమౌతుందని అధికారులు తెలిపారు.
కరోనా పరీక్షల కోసం స్వాబ్లు ఇచ్చిన వ్యక్తులకు... 15రోజుల తరువాత పాజిటివ్గా నిర్ధరణ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ వ్యక్తి తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటున్నారు. వారితో తిరిగిన వారందరూ కంగారు పడుతున్నారు. కొంతమందికి పాజిటివ్గా నిర్ధరణ అయ్యేలోపే మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిణామాలతో... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
దర్శి ప్రాంతంలో జూన్ 20, 25 తెదీల్లో కొంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధరించారు. వారితో తిరిగిన వారంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు.
ఇదీ చదవండి: