ETV Bharat / state

అదుపుతప్పి బోల్తా పడిన కారు...ఒకరు మృతి

ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహన చోదకుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు .

author img

By

Published : Dec 23, 2020, 6:11 PM IST

A car overturned in a canal
అదుపుతప్పి బోల్తా పడిన కారు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో వాహన చోదకుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నీటిలో మునిగి ఉన్న కారును గ్రామస్థుల సహకారంతో బయటకు తీశారు.

మృతుడు హైదరాబాద్​లోని సరూర్‌నగర్​ కు చెందిన యనమల సాయి సంతోష్ కుమార్​గా గుర్తించారు. చీరాల నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో వాహన చోదకుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నీటిలో మునిగి ఉన్న కారును గ్రామస్థుల సహకారంతో బయటకు తీశారు.

మృతుడు హైదరాబాద్​లోని సరూర్‌నగర్​ కు చెందిన యనమల సాయి సంతోష్ కుమార్​గా గుర్తించారు. చీరాల నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...అనపర్తి, బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.