జాతీయ స్థాయిలో గుర్తింపు
2014-15 ఏడాది ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమానికి.. యూనివర్శిటీకి చెందిన రోహిణి అనే విద్యార్థి జాతీయ ఉత్తమ వాలంటీరుగా ఎంపికై... ఇందిరాగాంధీ అవార్డును అందుకున్నారు. 2016-17కుగాను.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ అధికారిగా రమేష్ రెడ్డి ఎంపికయ్యారు. 2013-14, 2015-16లోనూ రాష్ట్ర స్థాయి అవార్డులను ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు గెలుచుకున్నారు. గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా 2400 మంది విద్యార్థులు 569 బృందాలు ఏర్పడి.. గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన సదస్సులు
విశ్వవిద్యాలయం పరిధిలో 92 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 110 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో 11 వేల మంది విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2367 మంది విద్యార్థులు రక్తదానం శిబిరాల్లో పాల్గొన్నారు. 2018-19లోనూ..విద్యార్థులు 85 వేల మొక్కలు నాటారు. గ్రామాల్లో 234 అవగాహన సదస్సులు, 310 వైద్యశిబిరాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: