నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్తసత్ర, అన్నగారిపాలెం, చిన్ననట్టు, పూలదొరువు తదితర ప్రాంతాల్లో రైతులు 300 ఎకరాల్లో చామ పంట సాగు చేశారు. పంట వేసిన నాలుగో నెల వచ్చేసరికి తెగుళ్లు సోకాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా తగ్గడం లేదని... ఉద్యానవనశాఖ అధికారులకు చెప్పారు. వారు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికే ఎకరానికి ఒకటిన్నర లక్షలు పెట్టుబడులు పెట్టగా... తెగులు సోకి పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీచూడండి.నెల్లూరులో నేల కూలిన భారీ వృక్షం