ETV Bharat / state

'2021-22 ఏడాది ఆస్తి పన్ను ఈ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ'

author img

By

Published : Apr 4, 2021, 6:03 PM IST

2021 - 22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్​ పరిధిలో 2020-21లో రూ. 55.11 కోట్ల వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచినట్లు ఆయన తెలిపారు.

Nellore Municipal Corporation Commissioner Dinesh Kumar
నెల్లూరు నగరపాలక సంస్థ

పన్నుల వసూలులో రాష్ట్రంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ ఉత్తమ పనితీరు కనబర్చినట్లు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 55.11 కోట్ల ఆస్థి పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు.

గత ఏడాది రూ. 33.35 కోట్ల పన్ను వసూలు చేయగా.. ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21.76 కోట్లు అదనంగా వసూలైనట్లు చెప్పారు. ఈ విభాగంలో.. రాష్ట్రంలోనే 5వ స్థానం సాధించామన్నారు. అలాగే... 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని చెప్పారు.

పన్నుల వసూలులో రాష్ట్రంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ ఉత్తమ పనితీరు కనబర్చినట్లు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 55.11 కోట్ల ఆస్థి పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు.

గత ఏడాది రూ. 33.35 కోట్ల పన్ను వసూలు చేయగా.. ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21.76 కోట్లు అదనంగా వసూలైనట్లు చెప్పారు. ఈ విభాగంలో.. రాష్ట్రంలోనే 5వ స్థానం సాధించామన్నారు. అలాగే... 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:

అర్చకుల హక్కులను జగన్ పరిరక్షిస్తున్నారు: రమణ దీక్షితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.