ETV Bharat / state

సచివాలయ మహిళా సిబ్బందిపై వైకాపా నేత వేధింపులు.. - Secretariat staff protest at Marripada mpdo office

నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సచివాలయ మహిళా సిబ్బందిని వేధిస్తున్న వైకాపా నేత సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మర్రిపాడు పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

Secretariat staff protest at Marripada mpdo office
మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది ఆందోళన
author img

By

Published : Aug 17, 2021, 4:40 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని సచివాలయ మహిళా సిబ్బందిని వైకాపా నేత ఎర్రమల సుబ్బారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు నందవరం సచివాలయ సిబ్బంది.. విధులు బహిష్కరించి మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైకాపా నేత వేధింపులు భరించలేక ఆందోళనకు దిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్ల బాధను ఎంపీడీవోకు విన్నవించుకున్నారు.

సచివాలయ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన‌ంతరం సుబ్బారెడ్డిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో పిర్యాదు చేశారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని సచివాలయ మహిళా సిబ్బందిని వైకాపా నేత ఎర్రమల సుబ్బారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు నందవరం సచివాలయ సిబ్బంది.. విధులు బహిష్కరించి మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైకాపా నేత వేధింపులు భరించలేక ఆందోళనకు దిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్ల బాధను ఎంపీడీవోకు విన్నవించుకున్నారు.

సచివాలయ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన‌ంతరం సుబ్బారెడ్డిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో పిర్యాదు చేశారు.

ఇదీ చదవండి..

ప్రభుత్వ జీవోలపై మరో అంతర్గత నోట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.