ETV Bharat / state

Crime news: లాడ్జిలో ఆత్మహత్యాయత్నం.. బాలిక పరిస్థితి విషమం

author img

By

Published : Aug 18, 2021, 12:51 PM IST

Updated : Aug 18, 2021, 3:27 PM IST

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ లాడ్జిలో 17ఏళ్ల యువతి, 42ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బుచ్చిరెడ్డి పాలెంలో విషం తాగి ఇద్దరు ఆత్మహత్యయత్నం
బుచ్చిరెడ్డి పాలెంలో విషం తాగి ఇద్దరు ఆత్మహత్యయత్నం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ పేరుతో ఓ జంట ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో 17ఏళ్ల యువతి, 42ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన లాడ్జి సిబ్బంది హాస్పిటల్​కు తరలించారు. దగదర్తి మండలం బాడుగులపాడుకు చెందిన రామయ్య అనే 42ఏళ్ల వ్యక్తి, జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన 17ఏళ్ల బాలికతో ప్రేమాయణం నడిపాడు. రామయ్యకు ఇదివరకే వివాహమై ఇద్దరు ఆడపిల్లలుండగా, మగ పిల్లాడి కోసం వరసకు మరదలయ్యే బాలికతో ఈ ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది.

మంగళవారం బాలికతో కలిసి బుచ్చిలోని లాడ్జికి వచ్చిన రామయ్య, తండ్రి, కూతురని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఈ రోజు ఉదయం ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని లాడ్జి సిబ్బంది గుర్తించి, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ పేరుతో ఓ జంట ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో 17ఏళ్ల యువతి, 42ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన లాడ్జి సిబ్బంది హాస్పిటల్​కు తరలించారు. దగదర్తి మండలం బాడుగులపాడుకు చెందిన రామయ్య అనే 42ఏళ్ల వ్యక్తి, జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన 17ఏళ్ల బాలికతో ప్రేమాయణం నడిపాడు. రామయ్యకు ఇదివరకే వివాహమై ఇద్దరు ఆడపిల్లలుండగా, మగ పిల్లాడి కోసం వరసకు మరదలయ్యే బాలికతో ఈ ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది.

మంగళవారం బాలికతో కలిసి బుచ్చిలోని లాడ్జికి వచ్చిన రామయ్య, తండ్రి, కూతురని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఈ రోజు ఉదయం ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని లాడ్జి సిబ్బంది గుర్తించి, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసు: 73వ రోజు సీబీఐ విచారణ.. అధికారులను కలిసిన సునీత

Last Updated : Aug 18, 2021, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.