ETV Bharat / state

గాయిత్రి వేసే చిత్రం... అసమాన ప్రతిభకు తార్కాణం... - నెల్లూరు జిల్లా వార్తలు

మనిషన్నాక కూసంత కళాపోషణ ఉండాలంటారు. ఈ అమ్మాయికి కాస్త ఎక్కువే ఉంది. చూసే మనసుండాలే కానీ సృష్టిలో ప్రతీది కళాత్మకమే. చిత్రకారులు అనేక మంది ఉంటారు కానీ, మైక్రోస్కోప్​తో చూస్తే గానీ కనిపించని అరుదైన చిత్రాల్ని, సహజసిద్ధంగా బియ్యపుగింజలపై గీస్తున్నారు... పేర్లు రాస్తున్నారీ అమ్మాయి. కాదేదీ కళాహృదయానికి అనర్హం అన్నట్టు దూసుకుపోతున్నారు.

Impressive Micro art by a nellore student!!
భళా!... సూక్ష్మకళ...!!
author img

By

Published : Oct 10, 2020, 10:29 PM IST

నెల్లూరుకు చెందిన గాయత్రి... స్టోన్ హౌస్ పేటకు చెందిన సత్యబాబు, రత్నప్రభ కుమార్తె. ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేశారు. ఏడో తరగతి నుంచి బొమ్మలు వేయడంపై ఆసక్తి ఎక్కువ. విభిన్నంగా బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఈ అభిరుచిని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించారు. అందులోనూ మైక్రో ఆర్ట్స్ పట్ల అసమాన ఇష్టాన్ని చూపించారు. మైక్రోఆర్ట్స్​లో ఎక్కువ మంది మైక్రోస్కోప్​లో చూస్తూ చిత్రం వేస్తారు.

గాయత్రికి ఎటువంటి పరికరం అవసరం లేదు. 1 సెంటీమీటరు కన్న తక్కువ పొడవు ఉన్న బియ్యపు గింజపై 80 నుంచి 100 అక్షరాలను సూక్ష్మంగా, అందంగా రాయగలరు. అందులోనూ సాధారణ పెన్నుతో ముత్యాల్లా అక్షరాలు రాస్తారు. రంగులతో బొమ్మలు వేస్తారు. సేమియా పుల్లపై పేర్లు రాస్తారు. అందమైన పైయింటింగ్స్ వేస్తారు. ఏకాగ్రతతో బియ్యపు గింజపై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.

పెన్సిల్ చెక్కి లిడ్​పై చక్కటి అక్షరాలు తీర్చి దిద్దుతారు గాయిత్రి. చాక్ పీస్​పై అచ్చుగుద్దినట్లు వినాయకుడు, శివలింగం. నోట్ పుస్తకం చివరలను మడిచి వివిధ ఆకృతుల్లో బొమ్మలు తయారుచేస్తారీమె. ఆవాలు, సబ్జా గింజలు మీద బొమ్మలు వేస్తారు. బియ్యపు గింజమీద ఇండియా పటము. వినాయకుడు, గాంధీ చిత్రాలు చిత్రీకరిస్తారు. ఆకుల మీద చిత్రాలు, పేర్లు రాస్తారు.

పుస్తకంపై చక్కటి రంగులతో బాహుబలి హీరో ప్రభాస్ చిత్రం కత్తిరించి, ఫోల్డ్ చేసి చిత్రాన్ని చూపిస్తారు. 0.7, 0.5ఎం.ఎం పెన్సిల్ లిడ్ పైనా అక్షరాలు చెక్కుతారు.

కళాశాలల్లో జరిగిన పోటీల్లో పాల్గొని, అనేక బహుమతులు పొందారు. ఆరు వరల్డ్ రికార్డులు అందుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, క్రెడెన్సీ బుక్ ఆఫ్ రికార్డు, వజ్రాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, బ్రేవో ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు.

గాయత్రి ఆసక్తిని గుర్తించి, కుటుంబసభ్యులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చదువుతోపాటు చిత్రకారిణిగానూ రాణిస్తుండటంతో ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించేందుకు ప్రయత్నం చేస్తానని గాయత్రి చెబుతున్నారు.

గాయిత్రి వేసే చిత్రం... అసమాన ప్రతిభకు తార్కాణం...

ఇది చదవండి: పంచాయతీలకు పోటీ..అభివృద్ధి ఆధారంగా అవార్డులు

నెల్లూరుకు చెందిన గాయత్రి... స్టోన్ హౌస్ పేటకు చెందిన సత్యబాబు, రత్నప్రభ కుమార్తె. ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేశారు. ఏడో తరగతి నుంచి బొమ్మలు వేయడంపై ఆసక్తి ఎక్కువ. విభిన్నంగా బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఈ అభిరుచిని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించారు. అందులోనూ మైక్రో ఆర్ట్స్ పట్ల అసమాన ఇష్టాన్ని చూపించారు. మైక్రోఆర్ట్స్​లో ఎక్కువ మంది మైక్రోస్కోప్​లో చూస్తూ చిత్రం వేస్తారు.

గాయత్రికి ఎటువంటి పరికరం అవసరం లేదు. 1 సెంటీమీటరు కన్న తక్కువ పొడవు ఉన్న బియ్యపు గింజపై 80 నుంచి 100 అక్షరాలను సూక్ష్మంగా, అందంగా రాయగలరు. అందులోనూ సాధారణ పెన్నుతో ముత్యాల్లా అక్షరాలు రాస్తారు. రంగులతో బొమ్మలు వేస్తారు. సేమియా పుల్లపై పేర్లు రాస్తారు. అందమైన పైయింటింగ్స్ వేస్తారు. ఏకాగ్రతతో బియ్యపు గింజపై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.

పెన్సిల్ చెక్కి లిడ్​పై చక్కటి అక్షరాలు తీర్చి దిద్దుతారు గాయిత్రి. చాక్ పీస్​పై అచ్చుగుద్దినట్లు వినాయకుడు, శివలింగం. నోట్ పుస్తకం చివరలను మడిచి వివిధ ఆకృతుల్లో బొమ్మలు తయారుచేస్తారీమె. ఆవాలు, సబ్జా గింజలు మీద బొమ్మలు వేస్తారు. బియ్యపు గింజమీద ఇండియా పటము. వినాయకుడు, గాంధీ చిత్రాలు చిత్రీకరిస్తారు. ఆకుల మీద చిత్రాలు, పేర్లు రాస్తారు.

పుస్తకంపై చక్కటి రంగులతో బాహుబలి హీరో ప్రభాస్ చిత్రం కత్తిరించి, ఫోల్డ్ చేసి చిత్రాన్ని చూపిస్తారు. 0.7, 0.5ఎం.ఎం పెన్సిల్ లిడ్ పైనా అక్షరాలు చెక్కుతారు.

కళాశాలల్లో జరిగిన పోటీల్లో పాల్గొని, అనేక బహుమతులు పొందారు. ఆరు వరల్డ్ రికార్డులు అందుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, క్రెడెన్సీ బుక్ ఆఫ్ రికార్డు, వజ్రాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, బ్రేవో ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు.

గాయత్రి ఆసక్తిని గుర్తించి, కుటుంబసభ్యులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చదువుతోపాటు చిత్రకారిణిగానూ రాణిస్తుండటంతో ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించేందుకు ప్రయత్నం చేస్తానని గాయత్రి చెబుతున్నారు.

గాయిత్రి వేసే చిత్రం... అసమాన ప్రతిభకు తార్కాణం...

ఇది చదవండి: పంచాయతీలకు పోటీ..అభివృద్ధి ఆధారంగా అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.