ETV Bharat / state

మరమ్మతులకు గురైన ఆర్టీసీ బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ చోరీ - నెల్లూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో డీజిల్ దొంగతనం

బంగారం, వెండి, నగదే కాదు.. ఇంధనాన్ని సైతం దొంగలు వదిలి పెట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సులో నుంచి 150 లీటర్ల డీజిల్​ను దుండగులు దోచేశారు. దీనిపై​ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్​ తెలిపారు.

diesel-theft-in-apsrtc-bus-by-thieves-at-nellore-district
ఆత్మకూరు డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో చోరీ
author img

By

Published : Dec 17, 2019, 4:08 PM IST

బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ చోరీ

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద మరమ్మతులకు గురై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి దుండగులు డీజిల్​ చోరీకి పాల్పడ్డారు. ప్రతి రోజూ లాగే బస్సును డ్రైవర్​ నందవరం కూడలి వద్ద ఉన్న పెట్రోల్​ బంకు వద్ద వదిలి వెళ్లాడు. తిరిగి ఉదయాన్నే తీసుకొని జంగాలపల్లి వెళ్లి విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా నందవరానికి సమీపంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డీజిల్ ట్యాంకును గమనించగా తాళం పగులగొట్టి ఉండడం వల్ల డీజిల్ చోరీ అయినట్లు గుర్తించాడు. జరిగిన విషయాన్ని డిపో మేనేజర్​కు తెలియజేశాడు. బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీనిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్​ తెలిపారు.

బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ చోరీ

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద మరమ్మతులకు గురై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి దుండగులు డీజిల్​ చోరీకి పాల్పడ్డారు. ప్రతి రోజూ లాగే బస్సును డ్రైవర్​ నందవరం కూడలి వద్ద ఉన్న పెట్రోల్​ బంకు వద్ద వదిలి వెళ్లాడు. తిరిగి ఉదయాన్నే తీసుకొని జంగాలపల్లి వెళ్లి విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా నందవరానికి సమీపంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డీజిల్ ట్యాంకును గమనించగా తాళం పగులగొట్టి ఉండడం వల్ల డీజిల్ చోరీ అయినట్లు గుర్తించాడు. జరిగిన విషయాన్ని డిపో మేనేజర్​కు తెలియజేశాడు. బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీనిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్​ తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతసాగరంలో పది మద్యం సీసాలు స్వాధీనం

Intro:Ap_nlr_11_17_oil chori_avb_AP10061Body:మరమ్మత్తులకు గురై ఆగివున్న ఆర్ టి సి బస్సు నుండి అర్ధరాత్రి డీజల్ చోరీకి పాల్పడ్డారు. డీజిల్ ట్యాంక్ తాళం పగులగొట్టి 150 లీటర్ల డీజిల్ ఎత్తుకెళ్ళారు కెటుగాళ్ళు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద మరమత్తులకు గురై ఆగివున్న ఆత్మకూరు డిపోకు చెందిన నందవరం స్కూల్ కు తీసుకెళ్ళె స్టూడెంట్ స్పెషల్ బస్సు నుండి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి డీజల్ చోరీకి పాల్పడ్డారు. ప్రతి రోజులాగే బస్సును డ్రైవర్ నందవరం కూడలి వద్ద గల పెట్రోల్ బంకు వద్ద నిలిపి వెళ్ళాడు. తిరిగి ఉదయాన్నే తీసుకొని జంగాలపల్లి వెళ్లి నందవరం స్కూల్ కు చెందిన విద్యార్థులను వేక్కించుకోని వస్తుండగా నందవరం కు సమీపంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డీజిల్ ట్యాంకను గమనించగా తాళం పగులగొట్టి తెరిచి ఉండడంతో డీజిల్ చోరీ అయినట్లు గుర్తించాడు. జరిగిన విషయాన్ని డిపో మేనేజర్ తెలియజేశాడు. నందవరం వద్దకు చేరుకున్నా డిపో మేనేజర్ రాంబాబు బస్సు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 150 లీటర్ల డిజల్ ను దోంగిలించారని తెలిపారు. ఈ ఘటనపై మర్రిపాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.