నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మేల్చూరు గ్రామంలో తెదేపా నాయకురాలు దేవికా చౌదరి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. భైవరం, మల్లెమాల గ్రామాల్లోనూ ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి కూరగాయలు అందించారు. ఏప్రిల్ 1 నుంచి కొన్ని గ్రామాల్లో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ఇదీ చదవండి..