ETV Bharat / state

విద్యార్థిపై కండక్టర్​ దాడి

తన దగ్గరకి వచ్చి టికెట్ తీసుకోలేదని కోపంతో విద్యార్థిపై కండక్టర్​ దాడిచేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లిలో జరిగింది. కండెక్టర్​పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి.. ఆర్టీసీ డీఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Jan 24, 2021, 5:07 PM IST

Updated : Jan 24, 2021, 5:17 PM IST

విద్యార్థిపై కండక్టర్​ దాడి
విద్యార్థిపై కండక్టర్​ దాడి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామానికి చెందిన కార్తీక్ మహిమలూరులో 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి గ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కి వెనుకవైపు కూర్చున్నాడు విద్యార్థి కార్తిక్. తన దగ్గరికి వచ్చి టికెట్​ తీసుకులేదని కోపంతో కండక్టర్ దూషించాడు. తనను ఎందుకు దూషిస్తున్నావని అడగగా దాడి చెేసినట్లు విద్యార్థి వాపోయాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి కండక్టర్​ను నిలదీయగా దిక్కున్నచోట చెప్పుకో‌మన్నారన్నారు. ఈ విషయంపై కార్తీక్ తండ్రి.. ఆర్టీసీ డీఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన కండక్టర్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామానికి చెందిన కార్తీక్ మహిమలూరులో 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి గ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కి వెనుకవైపు కూర్చున్నాడు విద్యార్థి కార్తిక్. తన దగ్గరికి వచ్చి టికెట్​ తీసుకులేదని కోపంతో కండక్టర్ దూషించాడు. తనను ఎందుకు దూషిస్తున్నావని అడగగా దాడి చెేసినట్లు విద్యార్థి వాపోయాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి కండక్టర్​ను నిలదీయగా దిక్కున్నచోట చెప్పుకో‌మన్నారన్నారు. ఈ విషయంపై కార్తీక్ తండ్రి.. ఆర్టీసీ డీఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన కండక్టర్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: సుబ్రమణ్యం.. ఉపాధ్యాయుల్లో ఉత్తముడు..!

Last Updated : Jan 24, 2021, 5:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.