ETV Bharat / state

కార్యకర్తగా గోడలపై రాతలు రాసి ఎదిగాను.. నా ఆకాంక్ష అదే: ఎమ్మెల్యే కోటంరెడ్డి

author img

By

Published : Feb 10, 2023, 5:12 PM IST

Mla kotam reddy latest Comments: 'ఒక కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. జెండాలు కట్టాను.. గోడలకు వాల్ పోస్టర్లు అంటించాను. చెట్లెక్కి బ్యానర్లు కట్టాను.. గోడలపై రాతలు రాసి రాజకీయాల్లో ఎదిగాను' అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడుతున్న ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశమిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తానని కోటంరెడ్డి తన ఆకాంక్షను తెలిపారు.

kotam reddy
kotam reddy

MLA Kotam Reddy Latest Comments: ''అధికారం అనుభవించి చివరలో బయటకెళ్లడం నాకు ఇష్టం లేదు.. బెదిరింపులు, కష్టాలు ఎదుర్కొని నా వెనక నిలిచిన వారికి కృతజ్ఞతలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అండగా నిలిచారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తా. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. టీడీపీ నుంచి నా పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. ప్రజలకు దగ్గరగా ఉండేందుకు నిత్యం కార్యక్రమాలు చేస్తూనే ఉంటా.'' అని నెల్లూరు గ్రామీణ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 18మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెటింగ్ సొసైటీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉండేందుకు మద్దతిచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మార్కెటింగ్ సొసైటీ నాయకులకు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైకిల్‌ గుర్తుపై గెలిచి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా సిద్ధమేనని ఆయన సవాల్‌ విసిరారు. వాళ్లను వదిలేసి తన గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటంరెడ్డి పునరుద్ఘాటించారు.

కార్యకర్తగా గోడలపై రాతలు రాసి ఎదిగాను.. నా ఆకాంక్ష అదే

ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న మాట్లాడిన మూడు నిమిషాల్లో మూడు రకాల స్టేట్​మెంట్లు ఇచ్చాడు. మొదట దమ్ము ఉంటే.. నాపై పోటీ చేయమన్నాడు. మళ్లీ ప్రతి 5 సంవత్సరాలకు అభ్యర్దులు మారుతారు అన్నాడు. ముందు ఆదాల ఒక మాట మీద నిలబడు. అలాగే, నిన్న ఒక ఎమ్మెల్యే నా రాజీనామా గురించి మాట్లాడాడు. టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ గుర్తుతో గెలిచి.. వైసీపీలోకి వచ్చిన వారిని ముందు రాజీనామా చేయమను. ఆ తర్వాత నా రాజీనామా గురించి ఆలోచిద్దాం.- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే

ప్రజా సమస్యలు తీర్చడానికి గాంధీగిరి తరహాలో తాను నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటానన్నారు. కష్టకాలంలో తన వెంట నడుస్తోన్న ప్రతి కార్యకర్త, నాయకులను ఎప్పటికీ మరిచిపోనని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం కూడా కార్యకర్త నుంచే ప్రారంభమైందన్నారు. మెజారిటీ కార్పొరేటర్లు, సర్పంచులు ప్రస్తుతం తనతో లేరని.. రాబోయే ఆరు నెలల్లో ప్రజలే చూస్తారని అన్నారు. రాజకీయం పరంగా 'మా తాత మంత్రి కాదు. కార్యకర్తగా జెండాలు కట్టాను. వాల్ పోస్టర్లు అంటించాను. గోడలపై రాతలు రాసి రాజకీయాల్లో ఎదిగాను. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కార్పొరేషన్​లో ఎప్పుడు సమావేశాలు జరిగినా.. పిలిచినా, పిలవకపోయినా నేను, మేయర్ వెళ్తాం.’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

MLA Kotam Reddy Latest Comments: ''అధికారం అనుభవించి చివరలో బయటకెళ్లడం నాకు ఇష్టం లేదు.. బెదిరింపులు, కష్టాలు ఎదుర్కొని నా వెనక నిలిచిన వారికి కృతజ్ఞతలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అండగా నిలిచారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తా. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. టీడీపీ నుంచి నా పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. ప్రజలకు దగ్గరగా ఉండేందుకు నిత్యం కార్యక్రమాలు చేస్తూనే ఉంటా.'' అని నెల్లూరు గ్రామీణ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 18మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెటింగ్ సొసైటీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉండేందుకు మద్దతిచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మార్కెటింగ్ సొసైటీ నాయకులకు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైకిల్‌ గుర్తుపై గెలిచి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా సిద్ధమేనని ఆయన సవాల్‌ విసిరారు. వాళ్లను వదిలేసి తన గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటంరెడ్డి పునరుద్ఘాటించారు.

కార్యకర్తగా గోడలపై రాతలు రాసి ఎదిగాను.. నా ఆకాంక్ష అదే

ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న మాట్లాడిన మూడు నిమిషాల్లో మూడు రకాల స్టేట్​మెంట్లు ఇచ్చాడు. మొదట దమ్ము ఉంటే.. నాపై పోటీ చేయమన్నాడు. మళ్లీ ప్రతి 5 సంవత్సరాలకు అభ్యర్దులు మారుతారు అన్నాడు. ముందు ఆదాల ఒక మాట మీద నిలబడు. అలాగే, నిన్న ఒక ఎమ్మెల్యే నా రాజీనామా గురించి మాట్లాడాడు. టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ గుర్తుతో గెలిచి.. వైసీపీలోకి వచ్చిన వారిని ముందు రాజీనామా చేయమను. ఆ తర్వాత నా రాజీనామా గురించి ఆలోచిద్దాం.- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే

ప్రజా సమస్యలు తీర్చడానికి గాంధీగిరి తరహాలో తాను నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటానన్నారు. కష్టకాలంలో తన వెంట నడుస్తోన్న ప్రతి కార్యకర్త, నాయకులను ఎప్పటికీ మరిచిపోనని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం కూడా కార్యకర్త నుంచే ప్రారంభమైందన్నారు. మెజారిటీ కార్పొరేటర్లు, సర్పంచులు ప్రస్తుతం తనతో లేరని.. రాబోయే ఆరు నెలల్లో ప్రజలే చూస్తారని అన్నారు. రాజకీయం పరంగా 'మా తాత మంత్రి కాదు. కార్యకర్తగా జెండాలు కట్టాను. వాల్ పోస్టర్లు అంటించాను. గోడలపై రాతలు రాసి రాజకీయాల్లో ఎదిగాను. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కార్పొరేషన్​లో ఎప్పుడు సమావేశాలు జరిగినా.. పిలిచినా, పిలవకపోయినా నేను, మేయర్ వెళ్తాం.’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.