ETV Bharat / state

ఓటర్లను రప్పించేందుకు నాయకుల కొత్త పోకడలు..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను గ్రామాల్లోకి రప్పించేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఎలాగైనా సొంతూళ్లకు తీసుకువచ్చేలా ఆన్​లైన్​లో నగదు పంపిణీ చేపడుతున్నారు. అందుకు అనుగుణంగా కొందరు నాయకులు రెట్టింపు కూలీతో పాటు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు వెనకడాటం లేదు. రవాణా వాహనాలను సమకూర్చడం నుంచి దారి ఖర్చులు ఇవ్వడం వరకూ అనేక రకాల షరతులకు నేతలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఆన్​లైన్​లోనే జరుగుతుండటం విశేషం.

author img

By

Published : Feb 4, 2021, 5:18 PM IST

migrate voters to return villages
ఓటర్లను రప్పించేందుకు నాయకుల కొత్త పోకడలు

కావలి పరిధిలోని ఓ పంచాయతీకి చెందిన కొందరు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఉపాధి కోసం ఏటా వలస వెళ్లే వీరు.. గత ఏడాది కరోనా కారణంగా స్వస్థలంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో బతుకుదెరువుకు బెంగళూరు బాట పట్టారు. పండగ తర్వాత పలువురు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోగా.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కావడంతో వెనక్కు రప్పించడంపై నాయకులు దృష్టి పెట్టారు. అనేక రకాలుగా తాయిలాలతో ఎరవేసేందుకు కసరత్తు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కొండాపురం మండలంలోని మరో పంచాయతీకి సంబంధించీ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఉపాధి పొందుతున్న వారిని పంచాయతీ ఎన్నికలకు రప్పించాలని రెండు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రవాణా వాహనాలు, ఖర్చులతో పాటు రోజు వారీ కూలి సొమ్మునూ అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఓ దశలో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంలో ఎవరికి వారు పోటీ పడుతుండటం చర్చనీయాంశమైంది.

ఆన్‌లైన్‌లో డబ్బు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రవాణా వాహనాలను సమకూర్చడం నుంచి దారి ఖర్చులు ఇవ్వడం వరకూ అనేక రకాల ఒప్పందాలకు దిగుతున్నారు. అవసరమైతే.. ఆ రెండు, మూడు రోజులకు రెట్టింపు కూలి ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. ఈ విషయంలో పార్టీల వారీగా పోటీ నెలకొనగా.. పంచాయతీల వారీగా ‘గుర్తింపు’ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఓటరు జాబితాలు ముందుంచుకుని వలస ఓటర్ల వివరాలపై ఆరా తీస్తుండటం చర్చగా మారింది.

పల్లెల్లో ఎనలేని సంబరం..

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. పల్లెల్లో ఎనలేని సంబరం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలంటే, ఆ కోలాహలమే వేరు. ప్రస్తుతం ఆ పరిస్థితి సింహపురి పల్లెల్లో ప్రస్పుటమవుతోంది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. తొలిదశలో కావలి రెవెన్యూ డివిజన్‌కు ఈ నెల 9న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈ దశలో మొత్తం 9 మండలాల్లో ఎన్నిక జరుగుతుండగా.. ప్రస్తుతం అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెదేపా, వైకాపా మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాల దిశగా వైకాపా తీవ్రంగా యత్నిస్తుండగా.. బరిలో నిలిచేందుకు తెదేపా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

ఇదీ పరిస్థితి..

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. చిన్న పంచాయతీల్లో వెయ్యి లోపు ఓట్లు ఉండటంతో పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. గతంలో ఒక్క ఓటుతో విజయం చేజిక్కించుకున్న ప్రజాప్రతినిధులు ఉండగా.. రెండు ఓట్ల తేడాతో ఓటమిపాలైన నాయకులు ఉన్న ఉదాహరణలు ఎన్నో. ఈ స్థితిలో ప్రతి ఓటును పక్కాగా ఖాతాలో వేసుకునేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఏకగ్రీవాలకు అవకాశం లేని చోట రెండు ప్రధాన పార్టీలు ఓటర్ల జాబితాలు ముందేసుకుని కసరత్తు చేస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నది ఓ ఎత్తయితే, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస ఓటర్లను స్వస్థలాలకు ఎలా రప్పించాలన్నది మరొకటి. ఆ క్రమంలోనే ఓటర్ల జాబితాలో ఎవరెవరు ఏయే రాష్ట్రాల్లో ఉన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆ మేరకు అంకెలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఖర్చుకు ముందడుగు..

ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల నుంచి అనేక మంది కూలీలుగా, కార్మికులుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఉంటున్నారు. తొలుత ఫోన్‌చేసి వారితో మాట్లాడుతున్న నాయకులు.. అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ట్రావెల్స్‌ బస్సుల్లో టిక్కెట్లు రిజర్వు చేసి వాటిని వారికి అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉన్న చోట్ల వాహన యజమానులతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులే వేయిస్తున్న పరిస్థితి ఉంటోంది. దారి ఖర్చులకు అవసరమైన సొమ్మును ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా మేస్త్రీల ఖాతాల్లో జమ చేస్తుండటం గమనార్హం.

ఎన్నికల కోసం ఉపాధి వదులుకుని వస్తుండటంతో కొన్నిచోట్ల ఆ రెండు, మూడు రోజులకు రెట్టింపు కూలీ అందించేందుకు నాయకులు వెనుకాడటం లేదు. చివరగా, గ్రామాల్లోని వలస కూలీల బంధువుల ద్వారానూ కొందరు నాయకులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం రెండో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. అక్కడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోరు వాడీవేడిగా మారుతోంది. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలుగా గుర్తింపు పొందినప్పటికీ.. తెరవెనుక మాత్రం పార్టీల మధ్యనే సమరం కనిపిస్తుండటం చర్చలో నిలుపుతోంది.

ఇదీ చదవండి:

వేలంలో రూ.50.50 లక్షలకు సర్పంచి పదవి!

కావలి పరిధిలోని ఓ పంచాయతీకి చెందిన కొందరు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఉపాధి కోసం ఏటా వలస వెళ్లే వీరు.. గత ఏడాది కరోనా కారణంగా స్వస్థలంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో బతుకుదెరువుకు బెంగళూరు బాట పట్టారు. పండగ తర్వాత పలువురు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోగా.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కావడంతో వెనక్కు రప్పించడంపై నాయకులు దృష్టి పెట్టారు. అనేక రకాలుగా తాయిలాలతో ఎరవేసేందుకు కసరత్తు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కొండాపురం మండలంలోని మరో పంచాయతీకి సంబంధించీ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఉపాధి పొందుతున్న వారిని పంచాయతీ ఎన్నికలకు రప్పించాలని రెండు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రవాణా వాహనాలు, ఖర్చులతో పాటు రోజు వారీ కూలి సొమ్మునూ అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఓ దశలో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంలో ఎవరికి వారు పోటీ పడుతుండటం చర్చనీయాంశమైంది.

ఆన్‌లైన్‌లో డబ్బు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రవాణా వాహనాలను సమకూర్చడం నుంచి దారి ఖర్చులు ఇవ్వడం వరకూ అనేక రకాల ఒప్పందాలకు దిగుతున్నారు. అవసరమైతే.. ఆ రెండు, మూడు రోజులకు రెట్టింపు కూలి ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. ఈ విషయంలో పార్టీల వారీగా పోటీ నెలకొనగా.. పంచాయతీల వారీగా ‘గుర్తింపు’ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఓటరు జాబితాలు ముందుంచుకుని వలస ఓటర్ల వివరాలపై ఆరా తీస్తుండటం చర్చగా మారింది.

పల్లెల్లో ఎనలేని సంబరం..

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. పల్లెల్లో ఎనలేని సంబరం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలంటే, ఆ కోలాహలమే వేరు. ప్రస్తుతం ఆ పరిస్థితి సింహపురి పల్లెల్లో ప్రస్పుటమవుతోంది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. తొలిదశలో కావలి రెవెన్యూ డివిజన్‌కు ఈ నెల 9న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈ దశలో మొత్తం 9 మండలాల్లో ఎన్నిక జరుగుతుండగా.. ప్రస్తుతం అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెదేపా, వైకాపా మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాల దిశగా వైకాపా తీవ్రంగా యత్నిస్తుండగా.. బరిలో నిలిచేందుకు తెదేపా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

ఇదీ పరిస్థితి..

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. చిన్న పంచాయతీల్లో వెయ్యి లోపు ఓట్లు ఉండటంతో పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. గతంలో ఒక్క ఓటుతో విజయం చేజిక్కించుకున్న ప్రజాప్రతినిధులు ఉండగా.. రెండు ఓట్ల తేడాతో ఓటమిపాలైన నాయకులు ఉన్న ఉదాహరణలు ఎన్నో. ఈ స్థితిలో ప్రతి ఓటును పక్కాగా ఖాతాలో వేసుకునేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఏకగ్రీవాలకు అవకాశం లేని చోట రెండు ప్రధాన పార్టీలు ఓటర్ల జాబితాలు ముందేసుకుని కసరత్తు చేస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నది ఓ ఎత్తయితే, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస ఓటర్లను స్వస్థలాలకు ఎలా రప్పించాలన్నది మరొకటి. ఆ క్రమంలోనే ఓటర్ల జాబితాలో ఎవరెవరు ఏయే రాష్ట్రాల్లో ఉన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆ మేరకు అంకెలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఖర్చుకు ముందడుగు..

ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల నుంచి అనేక మంది కూలీలుగా, కార్మికులుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఉంటున్నారు. తొలుత ఫోన్‌చేసి వారితో మాట్లాడుతున్న నాయకులు.. అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ట్రావెల్స్‌ బస్సుల్లో టిక్కెట్లు రిజర్వు చేసి వాటిని వారికి అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉన్న చోట్ల వాహన యజమానులతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులే వేయిస్తున్న పరిస్థితి ఉంటోంది. దారి ఖర్చులకు అవసరమైన సొమ్మును ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా మేస్త్రీల ఖాతాల్లో జమ చేస్తుండటం గమనార్హం.

ఎన్నికల కోసం ఉపాధి వదులుకుని వస్తుండటంతో కొన్నిచోట్ల ఆ రెండు, మూడు రోజులకు రెట్టింపు కూలీ అందించేందుకు నాయకులు వెనుకాడటం లేదు. చివరగా, గ్రామాల్లోని వలస కూలీల బంధువుల ద్వారానూ కొందరు నాయకులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం రెండో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. అక్కడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోరు వాడీవేడిగా మారుతోంది. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలుగా గుర్తింపు పొందినప్పటికీ.. తెరవెనుక మాత్రం పార్టీల మధ్యనే సమరం కనిపిస్తుండటం చర్చలో నిలుపుతోంది.

ఇదీ చదవండి:

వేలంలో రూ.50.50 లక్షలకు సర్పంచి పదవి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.