ETV Bharat / state

'అధిష్టానం లెక్కలు వేరు - నా ఆలోచనలు వేరు': ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

Narasaraopet MP Krishnadevarayulu Sensational Comments: వైఎస్సార్సీపీ అధిష్ఠానం చేస్తున్న మార్పులు, చేర్పులతో అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. అంతేగాక ఇంకా ఎంతోమంది క్యూలో ఉన్నారు. తాజాగా అధిష్టానం లెక్కలు వేరు తన ఆలోచనలు వేరంటూ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్​ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 2:43 PM IST

Updated : Jan 7, 2024, 7:02 AM IST

Narasaraopet_MP_krishnadevarayulu_Sensational_Comments
Narasaraopet_MP_krishnadevarayulu_Sensational_Comments

Narasaraopet MP Krishnadevarayulu Sensational Comments: వైఎస్సార్సీపీలో మార్పులు, చేర్పులు ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన ఈసారి తనను నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో 'అధిష్టానం లెక్కలు వేరు, నా లెక్కలు వేరు'అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని పేర్కొన్నారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట సీటు లేదనడంపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలనడంపై చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల జెడ్బీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎంపీని కలసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవోకి ప్రజాప్రతినిధులు 'క్యూ'

పార్టీని వీడుతున్న నాయకులు: డిసెంబర్ 28న వైఎస్సార్సీపీ అధినేత జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో క్యాంప్‌ కార్యాలయంలో అంబటి రాయుడు ఆ పార్టీలో చేశారు. పార్టీలో అడుగు పెట్టిన పది రోజుల్లోనే పార్టీ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడటంతో రాజకీయ నిపుణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వికెట్‌ పడటంతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి

గుంటూరు ఎంపీ టికెట్ జగన్ ఎవరికిస్తారు? : గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని (MP Lavu Sri Krishna Devarayalu) గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్‌ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏ మాత్రం అంగీకరించని శ్రీకృష్ణ దేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.

వైఎస్సార్​సీపీకి ఎదురు దెబ్బ - పార్టీ వీడిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

Narasaraopet MP Krishnadevarayulu Sensational Comments: వైఎస్సార్సీపీలో మార్పులు, చేర్పులు ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన ఈసారి తనను నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో 'అధిష్టానం లెక్కలు వేరు, నా లెక్కలు వేరు'అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని పేర్కొన్నారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట సీటు లేదనడంపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలనడంపై చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల జెడ్బీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎంపీని కలసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవోకి ప్రజాప్రతినిధులు 'క్యూ'

పార్టీని వీడుతున్న నాయకులు: డిసెంబర్ 28న వైఎస్సార్సీపీ అధినేత జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో క్యాంప్‌ కార్యాలయంలో అంబటి రాయుడు ఆ పార్టీలో చేశారు. పార్టీలో అడుగు పెట్టిన పది రోజుల్లోనే పార్టీ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడటంతో రాజకీయ నిపుణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వికెట్‌ పడటంతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి

గుంటూరు ఎంపీ టికెట్ జగన్ ఎవరికిస్తారు? : గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని (MP Lavu Sri Krishna Devarayalu) గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్‌ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏ మాత్రం అంగీకరించని శ్రీకృష్ణ దేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.

వైఎస్సార్​సీపీకి ఎదురు దెబ్బ - పార్టీ వీడిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

Last Updated : Jan 7, 2024, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.