ETV Bharat / state

డిగ్రీ, ఇంజినీరింగ్ యువకుల ఘర్షణ - దళిత యువకుడిని కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దాడి - నందిగామలో యువకుడిపై దాడి

Thugs Kidnapped and Attacked on Young Man: ఎన్టీఆర్​ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడ్ని కారులో కిడ్నాప్​ చేసిన దుండగులు.. అతనిపై దాడికి దిగారు. కారును రోడ్లపై తిప్పుతూ దాడికి దిగుతూ.. తనను చంపుతామని బెదిరించారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు.

thugs_kidnapped_and_attacked_on_young_man
thugs_kidnapped_and_attacked_on_young_man
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 6:53 AM IST

Updated : Nov 4, 2023, 9:08 AM IST

Thugs Kidnapped and Attacked on Young Man: ఏన్టీఆర్​ జిల్లాలో యువకుల మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. ఏడాది క్రితం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ దళిత యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆరుగురు యువకులు కలిసి ఆ యువకుడ్ని కిడ్నాప్​ చేశారు. కారులో ఆ యువకుడ్ని ఎక్కించుకుని దాడి చేస్తూ.. కారును రోడ్లపై తిప్పుతూ గుంటూరు వరకు తీసుకువెళ్లారు. అనంతరం ఆ యువకుడ్ని గుంటూరు వద్ద కారులోనే వదిలి వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కంచికచర్ల పట్టణంలోని అంబేడ్కర్​ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్​ కుమార్​ అనే యువకుడు.. నందిగామలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అతను డిగ్రి చదువుతున్న సమయంలో అతని​ స్నేహితులకు.. స్థానిక ఇంజనీరింగ్​ కళాశాలలోని ఇంజనీరింగ్ విద్యార్థికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ​

నెల్లూరు ఘటన మరువకముందే మరొకటి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఉపాధ్యాయుడి దాడి

సర్టిఫికేట్ల కోసం వెళ్లిన సమయంలో కిడ్నాప్​: ఇంజనీరింగ్​ విద్యార్థికి శ్యామ్​ కుమార్​ స్నేహితుల మధ్య వివాదం ముదిరి దాడికి దారి తీసింది. శ్యామ్​ కుమార్​ స్నేహితులు ఆ విద్యార్థిపై దాడికి దిగారు. దీంతో ఆ యువకుడు ఈ దాడిని మనసులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్యామ్​కుమార్​ తన కళాశాలకు సర్టిఫికెట్లకోసం వెళ్లిన సందర్భంలో.. ఆ యువకుడికి శ్యామ్​కుమార్​కు మధ్య వివాదం జరిగింది.

వివాదం ముదరడంతో ఆ యువకుడితో పాటు తన మిత్రులు కలిసి.. శ్యామ్​ కుమార్​ను బలవంతంగా కారు ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో శ్యామ్​ కుమార్​ మిత్రుడు బంధువులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో బంధువులు, శ్యామ్​ కుమార్​ మిత్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి గుంటూరు టోల్‌గేట్‌ సమీపంలో కారుతో సహా యువకుడ్ని వదిలి వెళ్లినట్లు తెలిసింది.

'సంచలన ఘటనతో ఫేమస్ అయ్యేందుకే ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదు'

గుంటూరులో లభ్యమైన ఆచూకీ: దాడికి గురైన బాధితుడు టోల్​గెేట్​ సమీపంలో ఉన్న విషయాన్ని తన సోదరుడికి ఫోన్​ చేసి వివరించగా.. అక్కడికి వెళ్లి బాధితుడ్ని తీసుకుని వచ్చి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దాడి చేశారని శ్యామ్​ కుమార్ తెలిపినట్లు అతని సోదరుడు వివరించాడు.​ దాడి అంశం ఎవరికైనా చెప్పితే చంపుతామని బెదిరించినట్లు వాపోయాడు.

శ్యామ్​ కుమార్​ను ప్రస్తుతం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్యామ్​ కుమార్​ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నందిగామ బీఎస్పీ నేత ఉదయ్‌కిరణ్‌ స్పందిస్తూ.. దుండగులు యువకులపై అమానుషంగా దాడికి దిగారని అన్నారు. పైశాచికంగా వ్యవహరిస్తూ.. కారులో తిప్పుతూ దాడి చేశారని .. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

YCP Leaders Attacked Businessman: పల్నాడు జిల్లాలో వైసీపీ 'గాడ్సే'లు.. కంపెనీ పెట్టిన ఎన్​ఆర్​ఐకి తీవ్ర ఇబ్బందులు.. కిడ్నాప్​కు యత్నం

Thugs Kidnapped and Attacked on Young Man: ఏన్టీఆర్​ జిల్లాలో యువకుల మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. ఏడాది క్రితం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ దళిత యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆరుగురు యువకులు కలిసి ఆ యువకుడ్ని కిడ్నాప్​ చేశారు. కారులో ఆ యువకుడ్ని ఎక్కించుకుని దాడి చేస్తూ.. కారును రోడ్లపై తిప్పుతూ గుంటూరు వరకు తీసుకువెళ్లారు. అనంతరం ఆ యువకుడ్ని గుంటూరు వద్ద కారులోనే వదిలి వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కంచికచర్ల పట్టణంలోని అంబేడ్కర్​ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్​ కుమార్​ అనే యువకుడు.. నందిగామలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అతను డిగ్రి చదువుతున్న సమయంలో అతని​ స్నేహితులకు.. స్థానిక ఇంజనీరింగ్​ కళాశాలలోని ఇంజనీరింగ్ విద్యార్థికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ​

నెల్లూరు ఘటన మరువకముందే మరొకటి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఉపాధ్యాయుడి దాడి

సర్టిఫికేట్ల కోసం వెళ్లిన సమయంలో కిడ్నాప్​: ఇంజనీరింగ్​ విద్యార్థికి శ్యామ్​ కుమార్​ స్నేహితుల మధ్య వివాదం ముదిరి దాడికి దారి తీసింది. శ్యామ్​ కుమార్​ స్నేహితులు ఆ విద్యార్థిపై దాడికి దిగారు. దీంతో ఆ యువకుడు ఈ దాడిని మనసులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్యామ్​కుమార్​ తన కళాశాలకు సర్టిఫికెట్లకోసం వెళ్లిన సందర్భంలో.. ఆ యువకుడికి శ్యామ్​కుమార్​కు మధ్య వివాదం జరిగింది.

వివాదం ముదరడంతో ఆ యువకుడితో పాటు తన మిత్రులు కలిసి.. శ్యామ్​ కుమార్​ను బలవంతంగా కారు ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో శ్యామ్​ కుమార్​ మిత్రుడు బంధువులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో బంధువులు, శ్యామ్​ కుమార్​ మిత్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి గుంటూరు టోల్‌గేట్‌ సమీపంలో కారుతో సహా యువకుడ్ని వదిలి వెళ్లినట్లు తెలిసింది.

'సంచలన ఘటనతో ఫేమస్ అయ్యేందుకే ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదు'

గుంటూరులో లభ్యమైన ఆచూకీ: దాడికి గురైన బాధితుడు టోల్​గెేట్​ సమీపంలో ఉన్న విషయాన్ని తన సోదరుడికి ఫోన్​ చేసి వివరించగా.. అక్కడికి వెళ్లి బాధితుడ్ని తీసుకుని వచ్చి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దాడి చేశారని శ్యామ్​ కుమార్ తెలిపినట్లు అతని సోదరుడు వివరించాడు.​ దాడి అంశం ఎవరికైనా చెప్పితే చంపుతామని బెదిరించినట్లు వాపోయాడు.

శ్యామ్​ కుమార్​ను ప్రస్తుతం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్యామ్​ కుమార్​ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నందిగామ బీఎస్పీ నేత ఉదయ్‌కిరణ్‌ స్పందిస్తూ.. దుండగులు యువకులపై అమానుషంగా దాడికి దిగారని అన్నారు. పైశాచికంగా వ్యవహరిస్తూ.. కారులో తిప్పుతూ దాడి చేశారని .. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

YCP Leaders Attacked Businessman: పల్నాడు జిల్లాలో వైసీపీ 'గాడ్సే'లు.. కంపెనీ పెట్టిన ఎన్​ఆర్​ఐకి తీవ్ర ఇబ్బందులు.. కిడ్నాప్​కు యత్నం

Last Updated : Nov 4, 2023, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.