ETV Bharat / state

'నాపై దాడి చేసి అవమానించారు.. అందుకే చనిపోతున్నా..!' - రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

అవమాన భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో.. తనపై కొందరు దాడి చేయటాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా' అంటూ సూసైడ్ నోటు రాసి తనవు చాలించాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా యల్లూరులో చోటుచేసుకుంది.

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మహేశ్
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మహేశ్
author img

By

Published : Apr 6, 2021, 9:41 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మహేశ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్​ను బంధువులు గుర్తించారు.

అమ్మా.. నాన్నా.. క్షమించండి..!

"అమ్మా, నాన్న.. క్షమించండి. ఈ నెల 5 వ తేదిన జరిగిన ఘర్షణలో పుట్టా సుబ్బారాయుడు, పుట్టా కిశోర్ కలిసి నన్న కొట్టారు. అందుకే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ ఘర్షణపై గోస్పాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. దానికి సంబంధించిన లెటర్ నా బాక్సులో సెల్​ఫోన్ కవర్​లో ఉంటుంది. నా ఛావుకు కారకులు... పుట్టా వెంకటేశ్వరమ్మ, పుట్టా సుబ్బారాయుడు, పుట్టా రాధ, పుట్టా కిషోర్, పుట్టా సురేశ్" అని సూసైడ్ లెటర్​లో మహేష్ ఆరోపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మహేశ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్​ను బంధువులు గుర్తించారు.

అమ్మా.. నాన్నా.. క్షమించండి..!

"అమ్మా, నాన్న.. క్షమించండి. ఈ నెల 5 వ తేదిన జరిగిన ఘర్షణలో పుట్టా సుబ్బారాయుడు, పుట్టా కిశోర్ కలిసి నన్న కొట్టారు. అందుకే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ ఘర్షణపై గోస్పాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. దానికి సంబంధించిన లెటర్ నా బాక్సులో సెల్​ఫోన్ కవర్​లో ఉంటుంది. నా ఛావుకు కారకులు... పుట్టా వెంకటేశ్వరమ్మ, పుట్టా సుబ్బారాయుడు, పుట్టా రాధ, పుట్టా కిషోర్, పుట్టా సురేశ్" అని సూసైడ్ లెటర్​లో మహేష్ ఆరోపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.