ETV Bharat / state

హోటళ్లలో విజిలెన్స్ తనిఖీలు.. నిర్వాహకులకు జరిమానాలు - తిరుపతిలో హోటల్ యజమానికి నోటీసులు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని నిల్వ చేస్తూ, భద్రతా ప్రమాణాలు పాటించని.. వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి, కర్నూలు జిల్లా ఆదోనిలో దాడులు చేసి.. కాలం చెల్లిన మాంసం, మోతాదుకు మించి రంగులు వాడుతున్న నిర్వాహకులకు జరిమానాలు విధించారు.

vigilance searches in hotels
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
author img

By

Published : Dec 10, 2020, 9:53 PM IST

తిరుపతిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నగరంలోని ఎంఆర్​పల్లి ప్రాంతంలో.. ఆహారం నిల్వ, సరైన ప్రమాణాలు పాటించకపోవడంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించారు. రంగులు అధికంగా వాడిన, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచిన హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు బార్ అండ్ రెస్టారెంట్​లపై.. విజిలెన్స్, ఆహార భద్రత సిబ్బంది దాడులు చేశారు. కాలం చెల్లిన మాంసం నిల్వ చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీప్తి బార్ నిర్వాహకుడికి రూ. 50 వేలు, రెడ్ చిల్లీ బార్ యజమానికి రూ. 20 వేలు చొప్పున జరిమానా విధించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు..?

తిరుపతిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నగరంలోని ఎంఆర్​పల్లి ప్రాంతంలో.. ఆహారం నిల్వ, సరైన ప్రమాణాలు పాటించకపోవడంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించారు. రంగులు అధికంగా వాడిన, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచిన హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు బార్ అండ్ రెస్టారెంట్​లపై.. విజిలెన్స్, ఆహార భద్రత సిబ్బంది దాడులు చేశారు. కాలం చెల్లిన మాంసం నిల్వ చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీప్తి బార్ నిర్వాహకుడికి రూ. 50 వేలు, రెడ్ చిల్లీ బార్ యజమానికి రూ. 20 వేలు చొప్పున జరిమానా విధించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.