ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని... కర్నూలు తెదేపా నాయకుడు టీజీ.భరత్ అన్నారు. వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో నగర సమీపంలోని గోశాలలో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోశాలలోని ఖాళీ ప్రదేశంలో 50 మొక్కలను సేవా దళ్ నాయకులు, విద్యార్థులు సంయుక్తంగా నాటారు. నగరంలో ఎవరికైన మొక్కలను కావాలంటే తమని సంప్రదిస్తే ఉచితంగా ఇస్తామని వాసవీ సేవా దళ్ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి...నైరుతి రుతుపవనాలు వచ్చినా లోటు వర్షపాతమే