ETV Bharat / state

శ్రీశైలం ఘాట్​రోడ్డు ప్రమాద మృతదేహాలు.. ఉస్మానియాకు తరలింపు - eeagalapenta news

మంగళవారం రాత్రి శ్రీశైలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడగా... వీరిలో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా మార్చురీకి తరలించారు.

srisalam accident
శ్రీశైలం ఘాట్​రోడ్డు ప్రమాద మృతదేహాలు
author img

By

Published : Sep 23, 2020, 10:28 PM IST

మంగళవారం రాత్రి శ్రీశైలం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణ నాగర్​కర్నూలు జిల్లా అమ్రాబాద్​ మండలం ఈగలపెంట వద్ద ఓ వ్యాన్​ సుమారు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా... వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

మృతులు నీతూ భాయ్, రాజకుమారి భాయ్​గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా... బాధితులు హైదరాబాద్​లోని దూల్​పేట్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మంగళవారం రాత్రి శ్రీశైలం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణ నాగర్​కర్నూలు జిల్లా అమ్రాబాద్​ మండలం ఈగలపెంట వద్ద ఓ వ్యాన్​ సుమారు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా... వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

మృతులు నీతూ భాయ్, రాజకుమారి భాయ్​గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా... బాధితులు హైదరాబాద్​లోని దూల్​పేట్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం... లోయలో పడిన వ్యాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.