కర్నూలులో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుబుంబ సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల జోక్యం వల్లే పోలీసులు.. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురి చేశారని ఆరోపించారు.
పోలీసులు, ఉన్నతాధికారులు... అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పనులు చేస్తే ఇబ్బందులకు గురవుతారని కర్నూలు పార్లమెంట్ తెదేపా ఆధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కోరారు.
ఇదీచదవండి