ETV Bharat / state

POWER HOLIDAY: నాపరాయి పరిశ్రమకు కరెంటు కోతలు.. ఆందోళనలో కార్మికులు

బేతంచర్ల అనగానే గుర్తొచ్చేది నాపరాయి పరిశ్రమ. ఎంతో మందికి వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ పరిశ్రమ.. పవర్‌ హాలిడే దెబ్బకు కుదేలవుతోంది. నిత్యం కార్మికులు, పనులతో సందడిగా ఉండే ఈ పరిశ్రమ.. కరెంటు కోతలతో వెలవెలబోతోంది.

author img

By

Published : Apr 26, 2022, 5:45 AM IST

POWER HOLIDAY
POWER HOLIDAY

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, బేతంచర్ల, రామాపురం ప్రాంతాల్లో వందలసంఖ్యలో నాపరాయి పరిశ్రమలున్నాయి. బేతంచర్లలోనే 400 పైగా పరిశ్రమలున్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరో 10వేల మంది వరకూ.. పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం, సోమవారం పవర్ హాలిడే కారణంగా కరెంట్‌ ఉండటం లేదు. నిర్వహణ పేరుతో శనివారం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలా వారంలో మూడు రోజులు పరిశ్రమలు మూసివేయాల్సి రావడం.. వ్యాపారాలకు శరాఘాతంలా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమలు మూసివేయడం తప్పదంటూ పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాపరాయి పరిశ్రమకు కరెంటు కోతలు.. ఆందోళనలో కార్మికులు

నాపరాయి పరిశ్రమ లాభసాటిగా ఉండటంతో ఎంతోమంది ఔత్సాహికులు లీజుకు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పవర్‌ హాలిడే కారణంగా కొంత కాలంగా వారూ తీవ్రంగా నష్టపోతున్నారు. అద్దెలు కూడా చెల్లించలేని స్థితికి పడిపోయారు. కూలీలను పోషించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

నాపరాయి పరిశ్రమలో..ఎంత పనిచేస్తే అంత ఎక్కువగా డబ్బు వస్తుండటంతో.. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా..బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా వంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారూ... పనులు చేసుకునేవారు. కరెంటు కోతల వల్ల... పనులు సరిగా లేక నిరాశలో పడిపోయారు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ రవాణా లారీలు, ట్రాక్టర్లూ నిలిచిపోయాయి .

కార్మికుల ఉపాధి దృష్ట్యా.. అంతరాయం లేని విద్యుత్ అందించాలని నాపరాయి పరిశ్రమ యజమానులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

ఇదీ చదవండి: స్పిన్నింగ్ మిల్లులపై పవర్​ కట్​ ప్రభావం... ఉపాధి కోల్పోతున్న కార్మికులు

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, బేతంచర్ల, రామాపురం ప్రాంతాల్లో వందలసంఖ్యలో నాపరాయి పరిశ్రమలున్నాయి. బేతంచర్లలోనే 400 పైగా పరిశ్రమలున్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరో 10వేల మంది వరకూ.. పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం, సోమవారం పవర్ హాలిడే కారణంగా కరెంట్‌ ఉండటం లేదు. నిర్వహణ పేరుతో శనివారం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలా వారంలో మూడు రోజులు పరిశ్రమలు మూసివేయాల్సి రావడం.. వ్యాపారాలకు శరాఘాతంలా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమలు మూసివేయడం తప్పదంటూ పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాపరాయి పరిశ్రమకు కరెంటు కోతలు.. ఆందోళనలో కార్మికులు

నాపరాయి పరిశ్రమ లాభసాటిగా ఉండటంతో ఎంతోమంది ఔత్సాహికులు లీజుకు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పవర్‌ హాలిడే కారణంగా కొంత కాలంగా వారూ తీవ్రంగా నష్టపోతున్నారు. అద్దెలు కూడా చెల్లించలేని స్థితికి పడిపోయారు. కూలీలను పోషించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

నాపరాయి పరిశ్రమలో..ఎంత పనిచేస్తే అంత ఎక్కువగా డబ్బు వస్తుండటంతో.. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా..బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా వంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారూ... పనులు చేసుకునేవారు. కరెంటు కోతల వల్ల... పనులు సరిగా లేక నిరాశలో పడిపోయారు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ రవాణా లారీలు, ట్రాక్టర్లూ నిలిచిపోయాయి .

కార్మికుల ఉపాధి దృష్ట్యా.. అంతరాయం లేని విద్యుత్ అందించాలని నాపరాయి పరిశ్రమ యజమానులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

ఇదీ చదవండి: స్పిన్నింగ్ మిల్లులపై పవర్​ కట్​ ప్రభావం... ఉపాధి కోల్పోతున్న కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.