కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఛైర్పర్సన్గా షేక్ మాబున్ని, వైస్ ఛైర్మన్గా గంగిశెట్టి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమావేశ గదిలో ప్రిసైడింగ్ అధికారి రామసుందర్ రెడ్డి ఎన్నిక పక్రియను చేపట్టారు. ఛైర్పర్సన్గా ఎన్నికైన షేక్ మాబున్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభినందించారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్పర్సన్గా ఎన్నికైన షేక్ మాబున్ని తెలిపారు.
ఇదీ చదవండి: