ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విచారణ రేపటికి వాయిదా

author img

By

Published : Feb 11, 2020, 5:42 PM IST

కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించటంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణ రేపటికి వాయిదా వేసింది.

కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ
కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ

అమరావతి ప్రాంతంలోని విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపారు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగింపుపై వేసిన పిటిషన్లపైనా విచారించారు. రాజకీయ లబ్ది కోసమే కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్థలాభావం వల్లే మారుస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

అమరావతి ప్రాంతంలోని విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపారు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగింపుపై వేసిన పిటిషన్లపైనా విచారించారు. రాజకీయ లబ్ది కోసమే కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్థలాభావం వల్లే మారుస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

'ఓ వైపు కావాలంటూనే... మరో వైపు కేసులు వేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.